రూ. 2 వేల ధరతోనే 'అరకు' ట్రిప్..! ఈ వన్ డే టూర్ ప్యాకేజీ చూడండి
ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన అరకును చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. వైజాగ్ నుంచి ఆపరేట్ చేయనుంది. ఈ ప్యాకేజీ జూన్ 12వ తేదీన అందుబాటులో ఉంది. టూర్ షెడ్యూల్, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
'VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 12 జూన్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
(image source AP Tourism)
https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు (Facebook)
వేర్వురు టూరిస్ట్ స్పాట్ లను కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా అరకు అందాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. వైజాగ్ నుంచి ఆపరేట్ చేయనున్నట్లు పేర్కొంది.
వేర్వురు టూరిస్ట్ స్పాట్ లను కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. తాజాగా అరకు అందాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. వైజాగ్ నుంచి ఆపరేట్ చేయనున్నట్లు పేర్కొంది.
ఈ ప్యాకేజీకి సంబంధించి 9281030748,9281495847 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR09 లింక్ పై క్లిక్ చేస్తే ప్యాకేజీ పూర్తి వివరాలు ఓపెన్ అవుతాయి. బుకింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
(Facebook)
అరకు వ్యాలీకి ఉదయం 10.55 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ్నుంచి పికప్ చేసుకుని… ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ సందర్శనకు తీసుకెళ్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్ కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.
అరకు వ్యాలీకి ఉదయం 10.55 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ్నుంచి పికప్ చేసుకుని… ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ సందర్శనకు తీసుకెళ్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్ కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.
విశాఖపట్నం - అరకు వ్యాలీ టూర్ ప్యాకేజీ ధరలు: ఈవీ క్లాస్ లో పెద్దలకు రూ.3010గా ఉంటే.. పిల్లలకు రూ. 2615గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో పెద్దలకు రూ. 2125గా ఉంది. పిల్లలకు రూ. 1730గా నిర్ణయించారు. 2S క్లాస్ లో అయితే పెద్దలకు రూ. 2055, పిల్లలకు రూ. 1655గా ఉంది.
(image source .istockphoto.com)
ఈ ప్యాకేజీలో భాగంగా అరకు వ్యాలీలోని పలు ప్రాంతాలను చూపిస్తారు. టూర్ షెడ్యూల్ చూస్తే… ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్(Train No. 58501 ) నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ అరకు వ్యాలీకు వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.
E-Paper

