తిరుమల ట్రిప్ ప్లాన్ ఉందా..? తక్కువ ధరలోనే IRCTC టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ...!
తిరుమల శ్రీవారి దర్శనానికి ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో తిరుపతితో పాటు శ్రీకాళహస్తిని దర్శించుకోవచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
తిరుపతి - హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ లో రూ. 13,810. డబుల్ షేరింగ్ కు రూ. 10,720, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 8,940గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 12,030, డబుల్ షేరింగ్ కు రూ. 8,940, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7,170 గా ఉంది. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.
(https://unsplash.com)
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR071A లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో అనేక ప్యాకేజీలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ నుంచి వీటిని ఆపరేట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ట్రిప్ 16 జూలై, 2025 వ తేదీన అందుబాటులో ఉంది.
“TIRUPATI BY VENKATADRI EXPRESS” పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్… నాలుగు రోజులు ఉంటుంది. ముందుస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.
3వ రోజు తెల్లవారుజామున హోటల్ నుంచి బయల్దేరుతారు. తిరుమలకు చేరుకుంటారు. ఉచిత క్యూ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత హోటల్ వద్ద డ్రాప్ చేస్తారు. సాయంత్రం 06.35 గంటల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రైలు (12798నెంబర్ ) బయల్దేరుతుంది. ఉదయం 06.20 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదించవచ్చు. తిరుమల శ్రీవారి దర్శనం మాత్రం క్యూలైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక టికెట్లను అందజేయమని ఐఆర్సీటీసీ టూరిజం స్పష్టం చేసింది.
ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకునేందుకు ఈ ప్యాకేజీని ప్రకటించింది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేయనుంది.
కాచిగూడ స్టేషన్ నుంచి రాత్రి 8.5 గంటల ట్రైన్(రైలు నెంబర్ 12797) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఉదయం 07.05 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత…. ఫ్రెషప్ అవుతారు. తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత హోటల్ కి చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే ఉంటారు.
E-Paper

