
కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న క్యారెక్టర్ లో అదరగొడుతున్న గాయత్రి సింహాద్రి తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
ఇవాళ (సెప్టెంబర్ 7) ఇన్ స్టాగ్రామ్ లో గాయత్రి సింహాద్రి పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
రెడ్ కలర్ లంగావోణీలో ముద్దుగుమ్మలా దర్శనమిచ్చింది గాయత్రి సింహాద్రి. మరీ ఇంత క్యూట్ హా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గాయత్రి సింహాద్రి పెట్టిన ఈ ఫొటోల పోస్టుకు ఓ అభిమాని ‘ప్లీజ్ రిప్లై ఇవ్వు గాయత్రి’ అని కామెంట్ పెట్టాడు. దానికి ‘హలో అండీ’ అని గాయత్రి రిప్లై ఇవ్వడం విశేషం.
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ లో గాయత్రి సింహాద్రి తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇన్ని రోజులూ విలనిజం చూపించిన ఆమె.. ఇప్పుడు ప్రేమలో మోసపోయిన అమ్మాయిగా బాధను చూపిస్తోంది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}