'తల్లికి వందనం' స్కీమ్ పై బిగ్ అప్డేట్ - రూ. 15 వేలు జమ కావాలంటే ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సిందే..!
ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ నెలలోనే ప్రారంభించనుంది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
'తల్లికి వందనం' పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి. ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అయి ఉండాలి, ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అర్హులవుతారు.
కనీసం 75 శాతం హాజరు కలిగి ఉంటేనే డబ్బులు జమవుతాయి. .తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ లిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.
ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.
ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని సూచించింది. ఇదే విషయాన్ని అధికారులు చెబుతున్నారు.
లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.జూన్ 5లోపే పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే…,విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ తల్లి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ , కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణపత్రం, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ ఉండాలి. ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి…. తల్లుల యొక్క ఎకౌంట్లో డబ్బులు జమ చేయనుంది.
E-Paper

