టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్ - రేపే మాక్ సీట్ల కేటాయింపు, ఎలా చెక్ చేసుకోవాలంటే..?
తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఫస్ట్ వెబ్ ఆప్షన్లు పూర్తి కాగా… రేపు(జూలై 13) మాక్ సీట్లను కేటాయించనున్నారు. ఆ తర్వాత మార్పు చేర్పులకు అవకాశం కల్పించి… జూలై 18వ తేదీన ఫైనల్ గా సీటును ఖరారు చేస్తారు.
ఆ తర్వాత ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. అంటే జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను(తుది) కేటాయిస్తారు.
వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులకు… ఈసారి కొత్తగా మాక్ సీట్లను కేటాయించనున్నారు. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉన్నత విద్యా మండలి మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు రేపు (జూలై 13) మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
(image source istock.com)
ఈ సరికొత్త విధానంతో విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని టీజీ ఈఏపీసెట్ అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది.
ఈ సరికొత్త విధానంతో విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని టీజీ ఈఏపీసెట్ అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది.
ఈ మాక్ కౌన్సెలింగ్ విధానంలో భాగంగా విద్యార్థికి వచ్చిన ర్యాంక్… ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా మాక్ సీట్(ప్రాథమికంగా) అలాట్మెంట్ చేస్తారు. విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తారు. చివరగా ఫైనల్ సీట్ అలాట్మెంట్ చేస్తారు. https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి మీ లాగిన్ వివరాలతో కూడా అప్డేట్ తెలుసుకోవచ్చు.
జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు… జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి అయిన సంగతి తెలిసిందే.
E-Paper

