ఏపీలో రేషన్ కార్డుల ప్రక్రియ - అందుబాటులోకి కొత్త ఆప్షన్లు..! ఇవిగో వివరాలు
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నడుస్తోంది. మరోవైపు పాత కార్డులో పేర్ల తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం మరికొన్ని మార్పులను చేసింది. కేవలం చనిపోయిన వారి పేర్లు మాత్రమే కాకుండా… ఇతర అంశాల్లో కూడా పేర్లు తొలగించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తుండగా… త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. అయితే తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ప్రక్రియలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన స్టేటస్ వివరాలను తెలుసుకోవచ్చు. ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ https://vswsonline.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు ఏ స్టేజీలో ఉందో, ఎవరి వద్ద పెండింగ్ లో స్టేటస్ చూపిస్తుంది. మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలియజేస్తారు.
కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన స్టేటస్ వివరాలను తెలుసుకోవచ్చు. ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్ సైట్ https://vswsonline.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'Service Request Status check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది. ఈ సెర్చ్ లింక్ లో రేషన్ కార్డు దరఖాస్తుకు సమయంలో ఇచ్చిన నెంబర్ (T123456789)ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. రేషన్ కార్డు ఏ స్టేజీలో ఉందో, ఎవరి వద్ద పెండింగ్ లో స్టేటస్ చూపిస్తుంది. మీ కార్డు సర్వీస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలియజేస్తారు.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఆగస్టు నెలలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను అందజేయనున్నారు.పాత కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డుల రూపంలో వీటిని తీసుకురానున్నారు. దీనికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి…. ఏటీఎం టైప్ లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముద్రణ ప్రక్రియ షురూ అయింది.
ఈ తొలగింపు ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారు అందులో తమ కుటుంబంలో స్ధానికంగా ఉండని వారి ఆధారాలు సమర్పించి…. పేర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసుకునే వీలును కల్పించిన సంగతి తెలిసిందే.
నేతల బొమ్మలు లేకుండా వీటిని ముద్రిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ఇందులో భాగంగా… కొత్తగా పంపిణీ చేయబోతే స్మార్ట్ రేషన్ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్ కార్డు నంబరు, రేషన్షాపు ఐడీ నంబర్ తో పాటు ఇతర తదితర వివరాలుంటాయి. అంతేకాకుండా క్యూఆర్ కూడా ఉంటుంది.
చనిపోయిన వారి పేర్ల తొలగింపు మాత్రమే కాకుండా…. వివాహం కారణంగా వేరే రాష్ట్రం/దేశానికి మైగ్రేట్ అయిన వారి పేర్లు కూడా తొలగించే ఆప్షన్ ఉంటుంది. ఉద్యోగరీత్యా వలస వెళ్లిన వారు, చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన వారితో పాటుఇతర సాంకేతిక కారణాల రీత్యా పేర్లను తొలగించుకోవచ్చు.
స్మార్ట్ రేషన్ కార్డు వెనక వైపున రేషన్ లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. అంతేకాకుండా శాశ్వత చిరునామాతో పాటు ఇతర వివరాలు ఉండేలా వీటిని రూపొందించారు.స్మార్ట్ రేషన్ కార్డుతో పలు ప్రయోజనాలు ఉంటాయి. ఈ కార్డును రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్ యంత్రాల సహాయంతో స్కాన్ చేస్తే ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి. రేషన్ సరుకుల వినియోగానికి సంబంధించిన సమాచారం కూడా కనిపిస్తుంది.
రేషన్ కార్డుల నుంచి సభ్యుల్ని తొలగించేందుకు ఏపీ పౌరసరఫరాల శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. చనిపోయిన కుటుంబ సభ్యుల పేర్లను మాత్రమే కాకుండా… వలసల కారణంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లిన సభ్యులను కూడా తొలగించేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మరికొన్ని ఆప్షన్లను తీసుకొచ్చింది.
E-Paper

