...
...
Next Story

మంగళగిరి రైల్వేస్టేషన్‌ లుక్ మారిపోయింది - ఈ కొత్త ఫొటోలు చూడండి

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..

Published on: Jan 21, 2026, 08:55:16 IST
Advertisement
<p>అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తయ్యాయి. </p>

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తయ్యాయి.

ఎయిర్ పోర్టుల తరహాలో మంగళగిరి రైల్వే స్టేషన్ లుక్ కనిపిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, రియర్ సైడ్ బిల్డింగ్, వీఐపీ లాంజ్ పనులు పూర్తి అయినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

ప్రస్తుతం ప్లాట్‌ఫాం సర్ఫేసింగ్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫెకేడ్ పనులు కొనసాగుతున్నాయని రైల్వేశాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.

రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మంగళగిరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు. మరో 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

మంగళగిరి రైల్వే స్టేషన్‌ ముందు చేనేత కార్మికురాలు మగ్గం నేస్తున్నట్లు ఏర్పాటు చేసిన విగ్రహం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధునీకరించిన వసతులతో కూడిన ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe