ఇక సులభంగా మ్యారేజ్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు - మీసేవలో అప్లయ్ చేసుకోవచ్చు, ఇవిగో వివరాలు

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 02, 2025 05:01 pm IST

తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మీసేవా ద్వారా మరో రెండు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ను మీసేవా ద్వారా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

1 / 6
<p>డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మీ-సేవా కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌తో పాటు భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:01 pm IST

డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మీ-సేవా కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌తో పాటు భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

2 / 6
<p>జూన్ 30వ తేదీ నుంచే ఈ 2 కొత్త సేవల కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గతంలో మ్యారేజీ సర్టిఫికెట్ ను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్దకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ సమస్య లేకుండా నేరుగా మీసేవా ద్వారానే అప్లయ్ చేసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:01 pm IST

జూన్ 30వ తేదీ నుంచే ఈ 2 కొత్త సేవల కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గతంలో మ్యారేజీ సర్టిఫికెట్ ను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్దకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ సమస్య లేకుండా నేరుగా మీసేవా ద్వారానే అప్లయ్ చేసుకోవచ్చు.

3 / 6
<p>ఇప్పటికే మీసేవా ద్వారా పలు సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా వచ్చిన ఈ రెండు కొత్త సేవలతో ప్రజలకు మరింత లబ్ధి చేకూరనుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:01 pm IST

ఇప్పటికే మీసేవా ద్వారా పలు సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా వచ్చిన ఈ రెండు కొత్త సేవలతో ప్రజలకు మరింత లబ్ధి చేకూరనుంది.

4 / 6
<p>మరోవైపు ల్యాండ్ మార్యెట్ వాల్యూకి సంబంధించిన సేవలను కూడా మీసేవా ద్వారా పొందవచ్చు. దరఖాస్తులో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్- రిజిస్ట్రార్ కార్యాలయం 24 గంటల్లోనే పరిశీలించి మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:01 pm IST

మరోవైపు ల్యాండ్ మార్యెట్ వాల్యూకి సంబంధించిన సేవలను కూడా మీసేవా ద్వారా పొందవచ్చు. దరఖాస్తులో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్- రిజిస్ట్రార్ కార్యాలయం 24 గంటల్లోనే పరిశీలించి మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు.

5 / 6
<p>మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు మీసేవాలో అందుబాటులోకి రావటంతో రియల్ ఎస్టేట్ తో పాటు క్రయవిక్రయాలు జరిపే వారికి సులభంగా ఈ ధ్రువపత్రాన్ని పొందే అవకాశం లభించినట్లు అయింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:01 pm IST

మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు మీసేవాలో అందుబాటులోకి రావటంతో రియల్ ఎస్టేట్ తో పాటు క్రయవిక్రయాలు జరిపే వారికి సులభంగా ఈ ధ్రువపత్రాన్ని పొందే అవకాశం లభించినట్లు అయింది.

6 / 6
<p>తాజా సేవల్లో భాగంగా…. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి రూ. 200 రుసుముతో మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వధూ వరుల మ్యారేజీ ఫోటోలు, ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ముగ్గురు సాక్షుల ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలన్నీ అప్‌లోడ్ చేసి వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 02, 2025 05:01 pm IST

తాజా సేవల్లో భాగంగా…. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి రూ. 200 రుసుముతో మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వధూ వరుల మ్యారేజీ ఫోటోలు, ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ముగ్గురు సాక్షుల ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలన్నీ అప్‌లోడ్ చేసి వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!