మూడు వేరువేరు ఐపీఎల్ టీమ్స్ని ఫైనల్కి తీసుకెళ్లిన వీరుడు! శ్రేయస్ అయ్యర్ లగ్జరీ లైఫ్ చూస్తే షాక్ అవుతారు..
ఐపీఎల్ 2025 రెండో క్వాలిఫయర్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది! 200 పరుగులు చేసిన తర్వాత ఎంఐ ఓడిపోవడం టీమ్ చరిత్రలో ఇదే తొలిసారి. పంజాబ్ కింగ్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్ ఇందుకు కారణం. ఇక ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నెట్ వర్త్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మూడు వేరువేరు ఐపీఎల్ టీమ్స్ని ఫైనల్కి తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి శ్రేయస్ అయ్యర్! 2020 ఐపీఎల్ ఫైనల్ ఆడిన దిల్లీ క్యాపిటల్స్ సభ్యుల్లో ఐయ్యర్ ఒకడు. ఇక 2024లో అయ్యర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ ట్రోఫీ గెలిచింది. 2025లో ట్రోఫీకి అడుగు దూరంలో ఉంది.
(AP)
శ్రేయస్ అయ్యర్ 2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 2018లో దిల్లీ తరఫున రూ. 7కోట్లకు ఆడాడు. 2022లో కోల్కతా నైట్ రైడర్స్ అతడిని రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2025 కోసం శ్రేయస్ అయ్యర్ని రూ. 26.75 కోట్లకు పంజాబ్ తీసుకుంది.
(PTI)
పలు మీడియా కథనాల ప్రకారం శ్రేయస్స్ అయ్యర్ నెట్ వర్త్ రూ. 60 కోట్ల నుంచి రూ. 70కోట్ల మధ్యలో ఉంటుంది.
(PTI)
అయ్యర్కి ముంబైలోని లోధా వరల్డ్ టవర్లో 4 బీహెచ్కే అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ రూ. 11.85 కోట్ల వరకు ఉండొచ్చు. అంతేకాదు, ఐయ్యర్కి మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, లంబొర్ఘిని హురికెన్, ఆడీ ఎస్5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి వీలువ రూ .6కోట్ల కన్నా ఎక్కువే.
(PTI)
2022- 2023 వరకు శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ గ్రేడ్ బీ కాంట్రాక్ట్లో ఉండేవాడు. ఆ సమయంలో వార్షికంగా రూ. 3కోట్లు అందేవి. 2024 ఫిబ్రవరిలో అతడి కాంట్రాక్ట్ని రద్దు చేసింది. ఇక 2025-2025 లో అయ్యర్కి గ్రేడ్ బీ కాంట్రాక్ట్ ఇచ్చింది బీసీసీఐ. పలు మీడియా కథనాల ప్రకారం గ్రేడ్ బీలో ఉన్న ప్లేయర్లకు వార్షికంగా రూ. 3కోట్లు అందుతాయి.
(PTI)
E-Paper

