ఫొటోలు : ఏపీకి చేరుకున్న బిల్ గేట్స్ - సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ సోమవరం ఉదయం ఏపీకి చేరుకున్నారు. బిల్ గేట్స్కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సచివాలయంలో భేటీ అయ్యారు.
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ ఏపీకి చేరుకున్నారు. బిల్గేట్స్కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. బిల్ గేట్స్ ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలికారు. వీరిద్దరి మధ్య నవ్వులు విరిశాయి.
సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించిన ఫ్లైట్ ల్యాండింగ్ కు పొగమంచుతో ఇబ్బందిరాగా… కొద్దిసేపు ఆలస్యంగా దిగారు. అనంతరం ఆయన నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు.
బిల్గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు ఘనస్వాగతం పలికారు.
బిల్ గేట్స్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందించారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఏపీలో గేట్స్ ఫౌండేషన్ చేపట్టిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించనున్నారు.
రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలిస్తారు
అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శించనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలిస్తారు
E-Paper

