...
...
Next Story

సిరాజ్‌కు 6 వికెట్లు.. టీమిండియాకు భారీ ఆధిక్యం.. సెంచరీల మోత మోగించిన స్మిత్, బ్రూక్

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు 180 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. అయితే ఒక దశలో ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడేలా కనిపించినా భారీ సెంచరీలతో స్మిత్, బ్రూక్ చెలరేగిపోయారు.

Published on: Jul 4, 2025, 22:11:04 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement
<p>హ్యారీ బ్రూక్ కూడా భారీ సెంచరీ చేశాడు. అతడు 234 బంతుల్లో 158 రన్స్ చేశాడు. 17 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా కొంప ముంచారు. లేదంటే ఇండియన్ టీమ్ మరింత పటిష్ట స్థితిలో ఉండేదే.</p>

హ్యారీ బ్రూక్ కూడా భారీ సెంచరీ చేశాడు. అతడు 234 బంతుల్లో 158 రన్స్ చేశాడు. 17 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా కొంప ముంచారు. లేదంటే ఇండియన్ టీమ్ మరింత పటిష్ట స్థితిలో ఉండేదే.

టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ కూడా 4 వికెట్లు తీశాడు. సిరాజ్ 6, ఆకాశ్ 4 తీయడంతో మిగిలిన బౌలర్లకు కనీసం ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా, సుందర్ లాంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ఇంగ్లండ్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ రెచ్చిపోయాడు. అతడు 204 బంతుల్లో 187 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. ఒక రకంగా అతడు వచ్చిన తర్వాతే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తీరే మారిపోయింది. అతడు ఎదురు దాడికి దిగడంతో టీమిండియా బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. దీంతో ఇంగ్లండ్ అంత భారీ స్కోరు చేయగలిగింది.

సిరాజ్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. ఆ జట్టులో ఏకంగా ఆరుగురు డకౌట్ కావడం విశేషం.

ఇంగ్లండ్ ఒక దశలో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ చెలరేగిపోయారు. ఇండియన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు ఏకంగా 303 పరుగులు జోడించారు.

ఇంగ్లండ్ తో బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీశాడు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe