
హ్యారీ బ్రూక్ కూడా భారీ సెంచరీ చేశాడు. అతడు 234 బంతుల్లో 158 రన్స్ చేశాడు. 17 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా కొంప ముంచారు. లేదంటే ఇండియన్ టీమ్ మరింత పటిష్ట స్థితిలో ఉండేదే.
టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ కూడా 4 వికెట్లు తీశాడు. సిరాజ్ 6, ఆకాశ్ 4 తీయడంతో మిగిలిన బౌలర్లకు కనీసం ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా, సుందర్ లాంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఇంగ్లండ్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ రెచ్చిపోయాడు. అతడు 204 బంతుల్లో 187 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. ఒక రకంగా అతడు వచ్చిన తర్వాతే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తీరే మారిపోయింది. అతడు ఎదురు దాడికి దిగడంతో టీమిండియా బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. దీంతో ఇంగ్లండ్ అంత భారీ స్కోరు చేయగలిగింది.
సిరాజ్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. ఆ జట్టులో ఏకంగా ఆరుగురు డకౌట్ కావడం విశేషం.
ఇంగ్లండ్ ఒక దశలో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ చెలరేగిపోయారు. ఇండియన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు ఏకంగా 303 పరుగులు జోడించారు.
ఇంగ్లండ్ తో బర్మింగ్హామ్ లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీశాడు.