...
...
Next Story

Nabha Natesh: ప్రేమకు థ్యాంక్స్ అంటూ నభా నటేష్ పోస్టు.. నాగబంధంలో పార్వతిగా క్యూట్ భామ.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

Nabha Natesh: టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. నాగబంధం సినిమాలో పార్వతిగా ఈ భామ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. తాజాగా క్యూట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ వైరల్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jul 4, 2026, 18:15:46 IST
Advertisement
<p>టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి తన అందం, నటనతో థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన నాగబంధం మూవీ జూలై 3న రిలీజైంది.</p>

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి తన అందం, నటనతో థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఆమె హీరోయిన్ గా నటించిన నాగబంధం మూవీ జూలై 3న రిలీజైంది.

రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు నాగబంధం మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నభా నటేష్. ఆమె లాస్ట్ మూవీ డార్లింగ్ 2024లో రిలీజైంది.

నాగబంధం సినిమాపై, చిత్రంలో పార్వతి క్యారెక్టర్ పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ పట్ల నభా నటేష్ పొంగిపోయింది. ఇన్ స్టాలో థ్యాంక్స్ చెప్తూ ఈ ఫొటోలను పోస్టు చేసింది.

నాగబంధం లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటించిన నభా నటేష్.. ఇప్పుడు నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో భారీ సినిమాతో థియేటర్లకు రాబోతుంది.

కన్నడ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన నభా నటేష్.. తెలుగులో నన్ను దోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాలు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe