కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అప్డేట్ - మీ కార్డు ఎలా తీసుకోవాలంటే..?

By Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
Published on Jul 03, 2025 06:20 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. జూలై 14వ తేదీ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందుకోసం సర్కార్ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. పంపిణీ ప్రక్రియను సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి……

1 / 8
<p>ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.

2 / 8
<p>రేషన్‌ కార్డుల మంజూరులో భాగంగా…. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

రేషన్‌ కార్డుల మంజూరులో భాగంగా…. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

3 / 8
<p>రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌( <a href="https://epds.telangana.gov.in/FoodSecurityAct/" target="_blank">https://epds.telangana.gov.in/FoodSecurityAct/</a> ) లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌( https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ) లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

4 / 8
<p>రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత…. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. ఆ తేదీలకు అనుగుణంగా…. లబ్ధిదారులు వారి రేషన్ కార్డులను తీసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత…. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. ఆ తేదీలకు అనుగుణంగా…. లబ్ధిదారులు వారి రేషన్ కార్డులను తీసుకోవచ్చు.

5 / 8
<p>తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఆఫ్ లైన్, మీసేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రేషన్ కూడా తీసుకున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఆఫ్ లైన్, మీసేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రేషన్ కూడా తీసుకున్నారు.

6 / 8
<p>తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కార్డుల మంజూరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కార్డుల మంజూరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

7 / 8
<p>ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 2 లక్షలకుపైగా రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా 15 లక్షలకుపైగా కుటుంబ సభ్యుల పేర్లను జత చేసినట్లు తెలుస్తోంది,<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 2 లక్షలకుపైగా రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా 15 లక్షలకుపైగా కుటుంబ సభ్యుల పేర్లను జత చేసినట్లు తెలుస్తోంది,

8 / 8
<p>కొత్త కార్డులతో పాటు పేర్లు జత చేయటం వంటి ప్రక్రియ సాగుతుండగా…. కొత్తగా ముద్రించిన కార్డుల పంపిణీ ఇంకా షురూ కాలేదు. అయితే ఈ ప్రక్రియను జూలై 14న ప్రారంభించాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగతున్నాయి.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 03, 2025 06:20 pm IST

కొత్త కార్డులతో పాటు పేర్లు జత చేయటం వంటి ప్రక్రియ సాగుతుండగా…. కొత్తగా ముద్రించిన కార్డుల పంపిణీ ఇంకా షురూ కాలేదు. అయితే ఈ ప్రక్రియను జూలై 14న ప్రారంభించాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగతున్నాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!