
ది రాజా సాబ్ మూవీతో రీసెంట్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. పవన్ కల్యాణ్ గురించి ఈ భామ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో నిధి అగర్వాల్ పాల్గొంది. ఇందులో పవన్ కల్యాణ్ గురించి అడగగా.. ఆయనో సింహం, ధైర్యవంతుడు, ఒంటరిగా నిలబడతారని చెప్పింది నిధి.
పవన్ కల్యాణ్ పీఎం అయితే ఆశ్చర్యపోను అని హోస్ట్ అడిగితే.. ‘‘అవును, నేను కూడా ఆశ్చర్యపోను. ఇప్పుడు గెలిచారు కాబట్టి వెలుగులోకి వచ్చారు. కానీ చాలా కాలం నుంచే పార్టీ కోసం పని చేస్తున్నారు’’ అని నిధి పేర్కొంది.
పవన్ కల్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేసింది నిధి అగర్వాల్. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.
తాజాగా ది రాజా సాబ్ అంటూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది ఈ భామ. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. డిజాస్టర్ గా నిలిచే అవకాశాలున్నాయి.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}