...
...
Next Story

IND vs AFG: రోహిత్ శర్మ రికార్డు.. ఇండియాకు అఫ్గానిస్థాన్ టఫ్ టార్గెట్.. డెబ్యూలో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసిన భారత పేసర్

IND vs AFG: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్థాన్ తో శనివారం జరుగుతున్న వన్డేలో హిట్ మ్యాన్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. మరోవైపు డెబ్యూలోనే ఇండియన్ పేసర్ గుర్నూర్ కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు.

Published on: Jun 13, 2026, 20:06:18 IST
Advertisement
<p>భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు నమోదు చేశాడు. వన్డే ఆడిన ఓల్డెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. శనివారం (జూన్ 13) అఫ్గానిస్థాన్ తో ఫస్ట్ వన్డే ఆడుతున్న రోహిత్ ఏజ్ 39 ఏళ్ల 75 రోజులు. మోహిందర్ అమర్ నాథ్ (39 ఏళ్ల 36 రోజులు) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. </p>

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు నమోదు చేశాడు. వన్డే ఆడిన ఓల్డెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. శనివారం (జూన్ 13) అఫ్గానిస్థాన్ తో ఫస్ట్ వన్డే ఆడుతున్న రోహిత్ ఏజ్ 39 ఏళ్ల 75 రోజులు. మోహిందర్ అమర్ నాథ్ (39 ఏళ్ల 36 రోజులు) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.

ఈ మ్యాచ్ తో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైటార్మ్ పేసర్ గుర్నూర్ సింగ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. తన తొలి ఓవర్లోనే అతను వికెట్ సాధించాడు. ఇబ్రహీం జద్రాన్ ను ఔట్ చేశాడు. డెబ్యూలోనే ఫస్ట్ ఓవర్లో వికెట్ పడగొట్టిన మూడో బౌలర్ గా గుర్నూర్ నిలిచాడు. మ్యాచ్ లో అతను మొత్తం 3 వికెట్లు తీశాడు.

మరో డెబ్యూ బౌలర్ హర్ష్ దూబె కూడా సత్తాచాటాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తన అరంగేట్ర వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తాచాటాడు.

వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన వన్డేలో అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ చెలరేగిపోయాడు. 51 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. దీంతో అఫ్గానిస్థాన్ ఇండియాకు టఫ్ టార్గెట్ సెట్ చేసింది.

ఫస్ట్ వన్డేలో అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 రన్స్ కు అలౌట్ అయింది. దాదాపుగా టీ20గా మారిన ఈ వన్డేలో టార్గెట్ ను భారత్ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe