
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు నమోదు చేశాడు. వన్డే ఆడిన ఓల్డెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. శనివారం (జూన్ 13) అఫ్గానిస్థాన్ తో ఫస్ట్ వన్డే ఆడుతున్న రోహిత్ ఏజ్ 39 ఏళ్ల 75 రోజులు. మోహిందర్ అమర్ నాథ్ (39 ఏళ్ల 36 రోజులు) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్ తో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైటార్మ్ పేసర్ గుర్నూర్ సింగ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. తన తొలి ఓవర్లోనే అతను వికెట్ సాధించాడు. ఇబ్రహీం జద్రాన్ ను ఔట్ చేశాడు. డెబ్యూలోనే ఫస్ట్ ఓవర్లో వికెట్ పడగొట్టిన మూడో బౌలర్ గా గుర్నూర్ నిలిచాడు. మ్యాచ్ లో అతను మొత్తం 3 వికెట్లు తీశాడు.
మరో డెబ్యూ బౌలర్ హర్ష్ దూబె కూడా సత్తాచాటాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తన అరంగేట్ర వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తాచాటాడు.
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన వన్డేలో అఫ్గాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ చెలరేగిపోయాడు. 51 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. దీంతో అఫ్గానిస్థాన్ ఇండియాకు టఫ్ టార్గెట్ సెట్ చేసింది.
ఫస్ట్ వన్డేలో అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 రన్స్ కు అలౌట్ అయింది. దాదాపుగా టీ20గా మారిన ఈ వన్డేలో టార్గెట్ ను భారత్ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి.