కాచిగూడ టు జోధ్పూర్ - డైలీ ట్రైన్ వచ్చేసింది, టైమింగ్స్ ఇలా
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. కాచిగూడ నుంచి రాజస్థాన్ లోని జోధ్పుర్కు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. జూలై 19వ తేదీన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి ఈ సూపర్ఫాస్ట్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి జోధ్పుర్లోని భగత్ కీ కోఠీ స్టేషన్ వరకు వెళ్లే ఈ రైలు వెళ్తుంది. వారంలో అన్ని రోజులు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఎప్పట్నుంచి ఈ డిమాండ్ తెరపైకి రాగా… వారి విజ్ఞప్తుల మేరకు ఈ రైలును రైల్వేశాఖ ప్రారంభించింది.
అధికారికంగా ఈ రైలు ఇవాళ ప్రారంభం కాగా.. జూలై 20 నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ప్రారంభం కానుంది. 17605 నెంబర్ గల ట్రైన్ కాచిగూడ నుండి రాత్రి 11:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇటార్సి, నర్మదాపురం, రాణి కమలపతి మీదుగా ఉదయం 4:00 గంటలకు ఉజ్జయిని చేరుకుంటుంది. ఇది అజ్మీర్ మార్గం ద్వారా రాత్రి 8:00 గంటలకు భగత్ కి కోఠి (జోధ్పూర్) చేరుకుంటుంది.
ఇగ అక్కడ్నుంచి అంటే… 17606 నెంబర్ గల ట్రైన్ రాత్రి 10:30 గంటలకు భగత్ కి కోఠి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు ఉజ్జయినికి చేరుతుంది. రాత్రి 10:40 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 3:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుతుంది.
నిజానికి హైదరాబాద్ నగరంలో రాజస్థానీయులు చాలా మంది ఉంటారు. వీరు వాళ్ల సొంత రాష్ట్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ సమస్యపై దృష్టిపెట్టిన రైల్వే శాఖ….. నేరుగా జోద్ పూర్ కు ట్రైన్ ను నడపాలని నిర్ణయించింది.
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. కాచిగూడ నుంచి చారిత్రక నగరం జోధ్పుర్కు కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. జూలై 19వ తేదీన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి ఈ సూపర్ఫాస్ట్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ డైలీ ఎక్స్ ప్రెస్ ట్రైన్…. కాచిగూడ నుండి ప్రారంభమై నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా స్టేషన్లల్లో ఆగుతుంది. అంతేకాకుండా ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలపతి, సంత్ హిర్దారం నగర్, సెహోర్, మక్సీ, ఉజ్జయిని, రత్లాం, జవ్రా, నేమ్డ్స, జవ్రా, మంద్రా, బిజయ్నగర్, నసీరాబాద్, అజ్మీర్, బీవార్, సోజత్ రోడ్, మార్వార్ జంక్షన్, పాలి మార్వార్, భగత్ కి కోఠి (జోధ్పూర్) స్టేషన్ కు చేరుతుంది.
ఇందులో మొత్తం 22 కోచ్లు ఉంటాయి. ఇందులో 2 ఏపీ, 3 ఏసీ, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.
E-Paper

