శని జయంతి వేళ అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు పట్టనున్న అదృష్టం
ఈ శని జయంతి నాడు 'శశ మహాపురుష రాజయోగం' ఏర్పడుతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, గత 13 ఏళ్లలో ఇలాంటి బలమైన గ్రహ స్థితి ఏర్పడలేదు. జ్యేష్ఠ అమావాస్య తిథి మే 16న తెల్లవారుజామున 5:11 గంటలకు ప్రారంభమై, మే 17న అర్థరాత్రి 1:30 గంటలకు ముగుస్తుంది.
శని జయంతి నాడు శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. మేషం, మీనం, కుంభ రాశుల జాతకాల్లో ఈ యోగం ఎలాంటి మార్పులు తెస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి: కొత్త ఉపాధి అవకాశాలు మేష రాశి వారికి ప్రస్తుతం శని ఏలినాటి శని మొదటి దశ నడుస్తోంది. అయినప్పటికీ, ఈ రాజయోగం వల్ల వీరికి కెరీర్లో కొత్త మార్గలు తెరుచుకుంటాయి. "ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. వ్యాపారస్తులు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి శుభవార్తలు అందుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది.
మీన రాశి వారికి శశ రాజయోగం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, క్రమశిక్షణతో పనిచేసే వారికి శని దేవుడు అండగా ఉంటాడు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి వీరికి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీల్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే, పెట్టుబడుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరమని పండితులు హెచ్చరిస్తున్నారు. మీ ఆలోచనా దృక్పథం సానుకూలంగా మారుతుంది.
శని ప్రస్తుతం కుంభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి, ఈ రాశి వారికి శని జయంతి నాడు శశ రాజయోగం ప్రత్యక్షంగా వర్తిస్తుంది. "కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది, వచ్చే ఏడాదితో ఇది ముగుస్తుంది" అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ శని జయంతి వేళ శని దేవుడిని పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది.
శని జయంతి రోజున శని దోషాల నుంచి విముక్తి పొందడానికి కొన్ని పరిహారాలు పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. శని ఆలయానికి వెళ్లి శని దేవుడికి ఆవ నూనెతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. "ఓం శం శనైశ్చరాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఒకవేళ సమీపంలో శని దేవాలయం లేకపోతే, శివలింగాన్ని పూజించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. శివలింగంపై ఆవ నూనె, నల్ల నువ్వులు సమర్పించి శని శాంతి అనుష్ఠానాలు చేసుకోవచ్చు.
E-Paper

