టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా చెలరేగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 రన్స్ చేసింది.
ఇండియన్ స్టార్ ఓపెనర్ మంధాన బ్యాటింగ్ లో సత్తాచాటింది. 44 బాల్స్ లోనే 68 రన్స్ చేసింది. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.
క్రీజులో సెట్ అయిన మంధానను రమీన్ షమీమ్ ఔట్ చేసింది. దీంతో ఇండియా జోరుకు కాస్త బ్రేక్ పడింది.
మరో ఎండ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రాణించింది. ఆమె 35 బంతుల్లో 36 పరుగులు చేసింది.
చివర్లో పవర్ హిట్టర్ రిచా ఘోష్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయింది. ఆమె 17 బంతుల్లోనే 34 రన్స్ కొట్టింది. 5 ఫోర్లు, ఓ సిక్సర్ బాది టీమ్ స్కోరు 170కి చేరడంలో కీలక పాత్ర పోషించింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}