...
...
Next Story

AP Inter Spot Evaluation 2026: నేటి నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం - ఇవిగో వివరాలు

AP Inter Spot Valuation 2026: నేటి నుంచి ఏపీ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ ప్రాసెస్ ఉంటుంది.ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

Published on: Mar 23, 2026, 08:55:42 IST
Advertisement
<p>నేటి నుంచి ఏపీ ఇంటర్ జవాబు పత్రాల  స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ ప్రాసెస్ ఉంటుంది.ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.</p>

నేటి నుంచి ఏపీ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ ప్రాసెస్ ఉంటుంది.ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

ముందుగా లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, మరియు ఎకనామిక్స్ పేపర్ల మూల్యాంకనం ఉండగా… వీటితో పాటు స్పెల్-1 కింద వచ్చే ఒకేషనల్ సబ్జెక్టుల పేపర్లను కూడా పూర్తి చేస్తారు. మిగతా సబ్జెక్టులను స్పెల్స్ వారీగా పూర్తి చేస్తారు.

ఇక స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఏపీ ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఒక్కో లెక్చరర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబు పత్రాలను మూల్యాంకనానికి ఇస్తారు.

మూల్యాంకన ప్రక్రియ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. మూల్యాంకనంలో పొరపాట్లు వస్తే భారీగా జరిమానాలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

ఏపీ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా 10వ తేదీలోపే రిలీజ్ చేేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పాట్ పూర్తి కాగానే… సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అంతా ఒకే అయిన తర్వాత… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…. అధికారికంగా ఓ తేదీని ప్రకటిస్తారు.

గతేడాది ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి కూడా ఏప్రిల్ రెండో వారంలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe