...
...
Next Story

AP Ration Steam Rice : తక్కువ ధరకే నిత్యావసరాలు, త్వరలోనే 1,000 మినీ మార్టులు! రేషన్‌ షాపుల్లో స్టీమ్‌ రైస్‌ కూడా..!

ఏపీలో రేషన్ కార్డుదారులకు త్వరలో స్టీమ్ రైస్ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఎన్‌సీసీఎఫ్‌ సహకారంతో 1,000 మినీమార్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Published on: Jun 09, 2026 01:25 PM IST
Advertisement
<p>ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల ద్వారా త్వరలోనే లబ్ధిదారులకు స్టీమ్‌ రైస్‌ (ఉడికించిన బియ్యం) అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు. </p><p> </p>

ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల ద్వారా త్వరలోనే లబ్ధిదారులకు స్టీమ్‌ రైస్‌ (ఉడికించిన బియ్యం) అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు.

ఈ ఏడాది పైలట్‌ ప్రాజెక్టు కింద పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ స్టీమ్ రైస్‌ను సరఫరా చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సరకులను అందుబాటు ధరల్లో అందించేందుకు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) సహకారంతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,000 మినీమార్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఈ మినీమార్టుల్లో కార్పొరేట్‌ సంస్థల సూపర్ మార్కెట్లతో పోటీపడేలా, మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను విక్రయించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బియ్యం మళ్లింపుపై ఉక్కుపాదం మోపుతూ ఇప్పటివరకు 5,354 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 'సీబీడీసీ' (డిజిటల్ రూపాయి) వాలెట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన నిత్యావసర సరకులను కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు.

నిల్వ ఉన్న బియ్యాన్ని కిలో రూ.23 చొప్పున ఇథనాల్ తయారీ పరిశ్రమలకు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe