...
...
Next Story

Tata Punch EV : 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​తో టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- భద్రతా ఫీచర్లు ఇవే..

భారత ఈవీ మార్కెట్​లో రారాజుగా ఉన్న టాటా పంచ్ ఈవీ, సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ప్రజల ముందుకు వచ్చింది. ఈ ఎలక్ట్రిక్​ కారుకు కూడా 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ లభించిందని సంస్థ స్వయంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ 2026 టాటా పంచ్​ ఈవీలోని వేరియంట్లు, వాటి సేఫ్టీ ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 23, 2026, 11:20:05 IST
Advertisement
<p>టాటా కార్లు అంటేనే భద్రతకు మారుపేరు. ఇప్పటికే గ్లోబల్ ఎన్​సీఏపీ, భారత్ ఎన్​సీఏపీలో 5-స్టార్ రేటింగ్ సాధించిన ట్రాక్ రికార్డ్ టాటా సొంతం. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా అదే స్థాయి ప్రమాణాలతో రూపొందింది.</p>

టాటా కార్లు అంటేనే భద్రతకు మారుపేరు. ఇప్పటికే గ్లోబల్ ఎన్​సీఏపీ, భారత్ ఎన్​సీఏపీలో 5-స్టార్ రేటింగ్ సాధించిన ట్రాక్ రికార్డ్ టాటా సొంతం. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా అదే స్థాయి ప్రమాణాలతో రూపొందింది.

స్మార్ట్ (బేస్ వేరియంట్): ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, హై-బీమ్ అసిస్ట్, టీపీఎంఎస్​ (టైర్ ప్రెజర్ మానిటరింగ్), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్​సీ), ఏబీఎస్​తో కూడిన ఈబీడీ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.

స్మార్ట్+ : ఇందులో అదనంగా డే/నైట్ ఐఆర్​వీఎం, రియర్ వ్యూ కెమెరా లభిస్తాయి. అయితే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో-హోల్డ్ వంటివి కేవలం 40 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి

అడ్వెంచర్ : పైన రెండు వేరియంట్లలోని ఫీచర్లతో పాటు ఇందులో అదనంగా 'హిల్ డిసెంట్ కంట్రోల్' ఫీచర్‌ను చేర్చారు.

ఎంపవర్డ్: వర్షం పడితే ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు, రియర్ వైపర్, డిఫాగర్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో అదనంగా ఉన్నాయి.

ఎంపవర్డ్+ ఎస్: ఇందులో పైన పేర్కొన్న అన్నిటితో పాటు అదనంగా 'ఆటో-డిమ్మింగ్ ఐఆర్​వీఎం' ఫీచర్ లభిస్తుంది. అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన ఈ కారు ధర రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు ఉంది. బీఏఏఎస్​ స్కీమ్ కింద కేవలం రూ. 6.49 లక్షలకే ఈ కారును సొంతం చేసుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe