...
...
Next Story

Tata cars : టాటా మోటార్స్ నుంచి క్రేజీ లైనప్- సియెర్రా స్పెషల్ ఎడిషన్, సఫారీ ఈవీ అప్డేట్స్..

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తన ఐకానిక్ సియెర్రా ఈవీని లాంచ్ చేసింది. ఇక ఈ ఏడాది మరో క్రేజీ కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ వివరాలను ఇక్కడే చూసేయండి..

Published on: Jul 05, 2026 12:32 PM IST
Advertisement
<p>భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తిరుగులేని రారాజుగా దూసుకుపోతున్న టాటా మోటార్స్, తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా సియెర్రా ఈవీ'ని అధికారికంగా విడుదల చేసింది. విశేషం ఏంటంటే, సియెర్రా పెట్రోల్/డీజిల్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చిన కేవలం ఏడు నెలల లోపే కంపెనీ దీని ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లాంచ్ సందర్భంగా టాటా మోటార్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్సవ ఒక ఆన్‌లైన్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. టాటా సియెర్రా, సియెర్రా ఈవీల స్పెషల్ ఎడిషన్లను తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నామని, ఇవి ఈ ఏడాది ఆఖరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కీలక ప్రకటన చేశారు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ల ఫీచర్ల వివరాలను మాత్రం ఆయన ఇంకా సీక్రెట్‌గా ఉంచారు.</p>

భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తిరుగులేని రారాజుగా దూసుకుపోతున్న టాటా మోటార్స్, తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా సియెర్రా ఈవీ'ని అధికారికంగా విడుదల చేసింది. విశేషం ఏంటంటే, సియెర్రా పెట్రోల్/డీజిల్ వెర్షన్ మార్కెట్లోకి వచ్చిన కేవలం ఏడు నెలల లోపే కంపెనీ దీని ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లాంచ్ సందర్భంగా టాటా మోటార్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్సవ ఒక ఆన్‌లైన్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. టాటా సియెర్రా, సియెర్రా ఈవీల స్పెషల్ ఎడిషన్లను తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నామని, ఇవి ఈ ఏడాది ఆఖరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కీలక ప్రకటన చేశారు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ల ఫీచర్ల వివరాలను మాత్రం ఆయన ఇంకా సీక్రెట్‌గా ఉంచారు.

టాటా మోటార్స్ కేవలం భారత మార్కెట్‌కే పరిమితం కాకుండా గ్లోబల్ లెవెల్లో విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సియెర్రా ఈవీని దక్షిణ ఆఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైట్-హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ అంతర్జాతీయ లాంచ్ విజయవంతం అయిన తర్వాత, సాధారణ పెట్రోల్/డీజిల్ సియెర్రా మోడళ్లను కూడా ఎంపిక చేసిన విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

దేశీయ ఈవీ విభాగంలో టాటా మోటార్స్ సుమారు 38 శాతం మార్కెట్ వాటాతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. గడిచిన క్వార్టర్ సేల్స్ డేటా చూస్తే.. టాటా సంస్థ ఏప్రిల్‌లో 8,543 యూనిట్లు, మేలో 10,340 యూనిట్లు, జూన్‌లో అత్యధికంగా 12,000 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. ఇదే జోరును కొనసాగిస్తూ 2026 దీపావళి సీజన్లో ‘సఫారీ ఈవీ’ని, ఆ తర్వాత 2027లో తన మొదటి ప్రీమియం సబ్‌-బ్రాండ్ ‘అవిన్యా’ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

టెస్టింగ్ సమయంలో లీకైన చిత్రాల ప్రకారం.. సరికొత్త టాటా సఫారీ ఈవీ హారియర్ ఈవీ నుంచి సేకరించిన అధునాతన ఇండిపెండెంట్ మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్‌తో రానుంది. టాటా సరికొత్త Acti.ev+ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మితమవుతున్న ఈ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్‌ను ఇటీవల విడుదలైన సియెర్రా ఈవీతో పంచుకోనుంది. అంటే ఇది 63కేడబ్ల్యూహెచ్, 75కేడబ్ల్యూహెచ్ బ్యాట్రీ ప్యాక్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది. సఫారీ ఈవీ వెలుపలి వైపు క్లోజ్డ్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్, 'EV' బ్యాడ్జింగ్‌తో రానుంది. కారు కొలతల్లో ఎలాంటి మార్పూ ఉండదు.

ఇంటీరియర్‌లో సరికొత్త థీమ్‌తో పాటు TiDAL (టాటా ఇంటెలిజెంట్ డిజిటల్ ఆర్కిటెక్చర్ లేయర్) సిస్టమ్‌ను ఇవ్వనున్నారు. ఇది ఓటీఏ (OTA) అప్‌డేట్స్, 540-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, యూపీఐ ఆధారిత ఇన్-కార్ పేమెంట్ సర్వీస్, ఆటో పార్క్ అసిస్ట్, లో-స్పీడ్ క్రూయిజ్ కంట్రోల్. సమ్మన్ మోడ్ వంటి నెక్స్ట్-జనరేషన్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

టాటా కంపెనీకి చెందిన సరికొత్త లగ్జరీ ఈవీ సబ్‌-బ్రాండ్ కింద రాబోతున్న మొదటి ప్రొడక్షన్ మోడల్ ‘అవిన్యా ఎక్స్’. ఈ సిరీస్ కార్లను జేఎల్ఆర్- చేరి భాగస్వామ్యంతో కూడిన ప్రీమియం ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేస్తున్నారు, ఇదే ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవల గ్లోబల్‌గా ఆవిష్కరించిన 'ఫ్రీల్యాండర్ ఈవీ'లోనూ వాడారు. భవిష్యత్తులో ఈ అవిన్యా బ్రాండ్ కింద ఒక లగ్జరీ త్రీ-రో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా తీసుకురావాలని టాటా గట్టి ప్లాన్‌తో ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe