తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ దరఖాస్తులు ప్రారంభం, చివరి తేదీ ఇదే
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రెన్యూవల్ అప్లికేషన్లకు కూడా అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియనుంది.
అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు. కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
అర్హులైన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదివరకే స్కాలర్షిప్ పొందుతున్న వారు రెన్యూవెల్ చేసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తవుతుంది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో పూర్తవుతుంది.
మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ను నోట్ చేసుకోవాలి.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిష్ల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విద్యార్థులే కాకుండా పాతవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.
E-Paper

