తెలంగాణలో మరో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ - ఈసారి నుంచే ప్రవేశాలు..! సీట్ల వివరాలివే
తెలంగాణలో ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈసారి కొత్తగా మహబూబ్నగర్లో క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఈ ఏడాది నుంచే ప్రవేశాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి……
ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 31 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ…. జూన్ 21వ తేదీతో ముగుస్తుంది.
ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 31 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ…. జూన్ 21వ తేదీతో ముగుస్తుంది.
మహబూబ్నగర్లో కొత్తగా ఆర్జీయూకేటీ ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 3 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (ఏఏ, మెషిన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(డేటా సైన్స్) కోర్సులు ఉంటాయి.
టెన్త్ పాస్ అయిన విద్యార్థుల నుంచి స్వీకరించే దరఖాస్తులను పరిశీలిస్తారు. జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అయితే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి కొత్తగా మరో క్యాంపస్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవలనే జీవోను కూడా జారీ చేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఐఐఐటీ సీట్ల సంఖ్య పెరగనుంది.
బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోడు మరో 180 సీట్లు కలిస్తే… ఈ సంఖ్య 1680కి చేరనుంది.గతంలో ఇందులో 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ప్రస్తుతం మొత్తం సీట్లకు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.
గ్రామీణ విద్యార్ధులను సాంకేతిక విద్యా రంగంలో ముందు నిలిపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటుంది. కేవలం మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు. అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు, సబ్జెక్టులలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులను వరుసగా పరిగణిస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే, వయస్సును పరిగణనలోకి తీసుకొని పెద్దవారికి సీట్లు కేటాయిస్తారు.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆరేళ్ల బీటెక్లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజిస్ (ఆర్జీయూకేటీ) బాసర నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
E-Paper

