...
...
Next Story

TG Inter Admissions 2026 : తెలంగాణ ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు - ఇదే చివరి ఛాన్స్

Telangana Inter 1st Year Admissions 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఆగస్టు 15 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు.

Published on: Aug 2, 2026, 13:37:10 IST
Advertisement
<p>తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యారంగం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఫస్టియర్) ప్రవేశాల ప్రక్రియ గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు అడ్మిషన్లు పొందలేకపోయిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.</p><p> </p>

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యారంగం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (ఫస్టియర్) ప్రవేశాల ప్రక్రియ గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు అడ్మిషన్లు పొందలేకపోయిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా ఆదేశాల ప్రకారం…. విద్యార్థులు ఈ నెల 15వ తేదీ (ఆగస్టు 15, 2026) వరకు తమకు నచ్చిన జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ గడువు పొడిగింపు ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, సొసైటీ, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయి.

అభ్యర్థులు కేవలం గుర్తింపు పొందిన కాలేజీల్లోనే చేరాలని, బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను సరిచూసుకోవాలని స్పష్టం చేశారు.

పదో తరగతి జీపీఏ, సబ్జెక్టు గ్రేడ్ మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలి. ప్రవేశాల కోసం కళాశాలలు ఎలాంటి ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించకూడదు. రోస్టర్ విధానం ప్రకారం ఎస్సీ (15%), ఎస్టీ (10%), బీసీ (29%), ఈడబ్ల్యూఎస్ (10%) కేటగిరీల రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి.

ప్రత్యేకంగా బాలికల కళాశాలలు లేని ప్రాంతాల్లో ప్రతి కేటగిరీలో 33.33 శాతం (మూడో వంతు) సీట్లను బాలికలకే కేటాయించాలి అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుంచి ఆధార్ సంఖ్యతో పాటు 'యాంటీ డ్రగ్ డిక్లరేషన్' పత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు స్పష్టం చేశారు.విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ద్వారా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe