...
...
Next Story

TG DOST Registration 2026 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ఇదిగో లింక్

TG DOST Registration 2026 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా నేటి నుంచి దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వార్ ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

Published on: Apr 15, 2026, 07:25:56 IST
Advertisement
<p>తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కోసం దోస్త్  -2026 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. <a href="https://dost.cgg.gov.in/" target="_blank">https://dost.cgg.gov.in/</a> వెబ్ సైట్ ద్వార్ ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. </p>

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కోసం దోస్త్ -2026 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వార్ ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

తొలి విడత రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచి మే 7వ తేదీ వరకు ఉంటాయి. ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు మొదటి విడతకు రూ. 200 చెల్లించాలి. ఒకవేళ రెండో విడత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 400 పేమెంట్ చేయాలి. గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

దోస్త్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.

త విద్యాసంవత్సరం (2025-26)లో మొత్తం 4.40 లక్షల సీట్లు ఉండగా, 2.05 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల శాతం పెరగడంతో డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అర్హులైన అభ్యర్థులు https://dost.cgg.gov.in/Authatication.do లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈసారి మొత్తం మూడు విడతల ద్వారా డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. జులై 1వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe