'అన్నదాత సుఖీభవ' స్కీమ్ అప్డేట్ - 'థంబ్ అథెంటికేషన్‌' తప్పనిసరి..! వెంటనే పూర్తి చేసుకోండి

By Maheshwaram Mahendra Chary, Andhrapradesh
Published on Jun 12, 2025 08:59 pm IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఎం కిసాన్ నిధులతో పాటే ఈ నిధులను విడుదల చేయనుంది. ఈ నిధులు జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే అవకాశం ఉంది. అయితే లబ్ధిదారులు.. థంబ్ అథంటిఫికేషన్ ప్రాసెస్ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

1 / 7
<p>అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతులు తప్పకుండా థంబ్ అథంటిఫికేషన్ ( Thumb Authentication) తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 12, 2025 08:59 pm IST

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతులు తప్పకుండా థంబ్ అథంటిఫికేషన్ ( Thumb Authentication) తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.

2 / 7
<p>పీఎం కిసాన్‌ కింద జూన్ 20వ తేదీన ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5వేల చొప్పున జమచేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు రూ.7వేలు అందుతాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 12, 2025 08:59 pm IST

పీఎం కిసాన్‌ కింద జూన్ 20వ తేదీన ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5వేల చొప్పున జమచేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు రూ.7వేలు అందుతాయి.

3 / 7
<div><p>కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. 2 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jun 12, 2025 08:59 pm IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. 2 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

4 / 7
<p>ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పధకానికి అర్హత పొందాలంటే… రైతు సేవా కేంద్రం వద్ద ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 12, 2025 08:59 pm IST

ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పధకానికి అర్హత పొందాలంటే… రైతు సేవా కేంద్రం వద్ద ఈ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

5 / 7
<p>అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ <a href="https://annadathasukhibhava.ap.gov.in/" target="_blank">https://annadathasukhibhava.ap.gov.in/</a> లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 12, 2025 08:59 pm IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.

6 / 7
<p>Thumb Authentication నమోదు చేయని రైతులకు స్కీమ్ వర్తింపు కాదని హెచ్చరిస్తున్నారు. అన్ని అర్హతలున్న వారు… సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పథకం కింద లబ్ధి పొందగలుగుతారని స్పష్టం చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 12, 2025 08:59 pm IST

Thumb Authentication నమోదు చేయని రైతులకు స్కీమ్ వర్తింపు కాదని హెచ్చరిస్తున్నారు. అన్ని అర్హతలున్న వారు… సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పథకం కింద లబ్ధి పొందగలుగుతారని స్పష్టం చేస్తున్నారు.

7 / 7
<p>రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 12, 2025 08:59 pm IST

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!