...
...
Next Story

ఐఎమ్‌డీబీ ప్రకారం 2025లో బాగా నవ్వించిన 7 కామెడీ సినిమాలు ఇవే.. 4 ఓటీటీలో స్ట్రీమింగ్, 3 థియేటర్లలో.. తెలుగు 2 మాత్రమే!

2025 సంవత్సరం ముగియడానికి కొన్ని ఇంకో నెల మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా ఈ సంవత్సరం విడుదలైన అత్యంత శక్తివంతమైన కామెడీ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఐఎమ్‌డీబీ ప్రకారం ఈ ఏడాది బాగా నవ్వించిన ఏడు సినిమాలు, అందులో 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవడం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 20, 2025, 13:23:19 IST
Advertisement
<p> కామెడీ సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. గందరగోళమైన జీవితంలో మనస్సుకు మనశ్శాంతినిచ్చేవి కామెడీ చిత్రాలు. మరి ఈ 2025లో బాాగా నవ్వించిన టాప్ 7 కామెడీ సినిమాలు, వాటిలో ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం. </p>

కామెడీ సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. గందరగోళమైన జీవితంలో మనస్సుకు మనశ్శాంతినిచ్చేవి కామెడీ చిత్రాలు. మరి ఈ 2025లో బాాగా నవ్వించిన టాప్ 7 కామెడీ సినిమాలు, వాటిలో ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం.

గిచ్ పిచ్- ఆగస్టు 2025లో విడుదలైన గిచ్‌పిచ్ చిత్రం భారతీయ మధ్యతరగతి తండ్రులు, వారి పిల్లలతో సాగే కథతో ఉంటుంది. ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీ రేటింగ్ 8.5 ఉంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీ- ఏప్రిల్ 2025లో వచ్చిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రం తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రం కలెక్షన్ల పరంగా అద్భుతాలు చేసింది. శ్రీలంకలో కోవిడ్ తర్వాత ఉద్యోగం కోసం భారతదేశానికి వచ్చిన ఒక కుటుంబం కథ ఇది. ఈ చిత్రం ఐఎమ్‌డీబీ రేటింగ్ 8.2 ఉంది. ఈ సినిమా తెలుగులో జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో ఉంది.

అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ చిత్రం 'దే దే ప్యార్ దే 2' థియేటర్లలో చాలా ఆదరణ పొందింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి 8.5 ఐఎండీబీ రేటింగ్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 2026లో ఓటీటీలోకి ఈ సినిమా రానుందని సమాచారం.

జాలీ ఎల్‌ఎల్‌బి 3 - ఈ ఏడాది విడుదలైన అత్యధిక ఐఎండీబీ రేటింగ్స్ ఉన్న చిత్రాలలో 'జాలీ ఎల్ ఎల్ బీ 3' కూడా నిలిచింది. ఇద్దరు న్యాయవాదుల మధ్య సరదాగా జరిగిన ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6.8 ఉంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

థామా- ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'థామా' కూడా ఈ జాబితాలో ఉంది. ఇది ఐఎండీబీలో 6.4 రేటింగ్ ను కలిగి ఉంది. కామెడీతో పాటు చాలా హర్రర్ సినిమాను కూడా ఈ సినిమాలో చేర్చారు. అమెజాన్ ప్రైమ్‌లో త్వరలో తెలుగులో కూడా థామా ఓటీటీ రిలీజ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్‌లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ చిత్రం 'ధూమ్ ధామ్' చిత్రం అద్భుతాలు చేసింది. నూతన వధూవరుల కథతో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ, థ్రిల్ రెండింటినీ పంచింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 6.4 ఉంది. తెలుగులో కూడా ధూమ్ ధామ్ అందుబాటులో ఉంది.

సితారే జమీన్ పర్- అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన తారే జమీన్ పర్ సినిమాకు చాలా కాలం తర్వాత వచ్చిన సీక్వెల్ మూవీ సితారే జమీన్ పర్. కామెడీతోపాటు మంచి మెస్సేజ్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాకు IMDb లో 6.9 రేటింగ్ వచ్చింది. ఈ సినిమాను యూట్యూబ్‌లో హిందీలో చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe