
టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగాడు. జింబాబ్వేతో మూడో టీ20లో ధనాధన్ బ్యాటింగ్ తో సత్తాచాటాడు.
ఆదివారం (జూలై 26) జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. కొద్దిలో అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు.
సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 29 పరుగులు సాధించాడు. అతను 4 ఫోర్లు కొట్టాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు ఉన్నాయి. రింకు సింగ్ 25 రన్స్ కొట్టాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు ఇండియా 192 పరుగులు సాధించింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}