'తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్స్ - మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే...!
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12 నుంచి స్కీమ్ ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద చదువుకునే విద్యార్థులకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలెంటో ఇక్కడ తెలుసుకోండి
ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమవుతాయి. అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింకింగ్ చేసుకోవాలి. ఇందుకు జూన్ 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు… రాష్ట్ర నివాసి అయి. ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అయి ఉండాలి, ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అర్హులవుతారు.కనీసం 75 శాతం హాజరు కలిగి ఉంటేనే డబ్బులు జమవుతాయి. .తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ లిగి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.
దరఖాస్తు కోసం నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ , కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ అవసరమవుతుంది. ఇంకా ఏమైనా పత్రాలు అవసరమైతే… ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ప్రకటనలో తెలుసుకోవచ్చు.
లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు.జూన్ 5లోపే పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
ఈ స్కీమ్ కింద ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం కింద డబ్బులు జమ చేస్తారు. ప్రతి సంవత్సరం 15,000 ఇస్తారు.
తల్లికి వందనం స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ తల్లి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉండాలి.
ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ 12 నుంచి ప్రారంభించనుంది. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని తాజాగానే ప్రభుత్వం సూచించింది.
ఏపీ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ జూన్ 12 నుంచి ప్రారంభించనుంది. ఈ స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే… విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని తాజాగానే ప్రభుత్వం సూచించింది.
ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి రేపోమాపో అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
E-Paper

