'అన్నదాత సుఖీభవ స్కీమ్' డబ్బులు ఎప్పుడు వస్తాయి..? తాజా అప్డేట్స్ ఇవే

By Maheshwaram Mahendra Chary, Andhrapradesh
Updated On Jul 10, 2025 04:26 pm IST

పంట పెట్టుబడి సాయం కోసం ఏపీ సర్కార్ అన్నదాత సుఖీభవ స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ కింద అందే సాయం రైతులు ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ నిధులతో పాటే వీటిని కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ స్కీమ్ డబ్బుల విడుదలపై ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

1 / 8
<p>పీఎం కిసాన్ నిధులతో పాటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులను కూడా జమ చేయనుంది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయితే ఈ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

పీఎం కిసాన్ నిధులతో పాటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులను కూడా జమ చేయనుంది. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. అయితే ఈ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

2 / 8
<p>అన్నదాత సుఖీభవ స్కీమ్ అర్హుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అర్హుల స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ <a href="https://annadathasukhibhava.ap.gov.in/" target="_blank">https://annadathasukhibhava.ap.gov.in/</a> లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే జూలై 13వ తేదీలోపు అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

అన్నదాత సుఖీభవ స్కీమ్ అర్హుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అర్హుల స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లాలి. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే జూలై 13వ తేదీలోపు అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.

3 / 8
<div><p>దేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చే పథకం పీఎం కిసాన్. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ విడత జూలై 18న రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో బీహార్ సందర్శించే అవకాశం ఉంది. ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 అందజేస్తారు. ప్రతి విడతలో(మొత్తం 3 విడతలు) రూ. 2 వేలు జమ చేస్తారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

దేశంలోని రైతులకు లబ్ధి చేకూర్చే పథకం పీఎం కిసాన్. ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ విడత జూలై 18న రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో బీహార్ సందర్శించే అవకాశం ఉంది. ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 అందజేస్తారు. ప్రతి విడతలో(మొత్తం 3 విడతలు) రూ. 2 వేలు జమ చేస్తారు.

4 / 8
<p>జూలై 18వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదలైతే… వీటితో పాటే అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులు కూడా రైతుల ఖాతాలోకి వస్తాయి. ఒకవేళ ఈ తేదీ కాకపోతే… మరో తేదీలో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ జూలై నెలలోనే పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు జమవుతాయని అధికారిక వర్గాల మేరకు తెలుస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

జూలై 18వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదలైతే… వీటితో పాటే అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులు కూడా రైతుల ఖాతాలోకి వస్తాయి. ఒకవేళ ఈ తేదీ కాకపోతే… మరో తేదీలో వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ జూలై నెలలోనే పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు జమవుతాయని అధికారిక వర్గాల మేరకు తెలుస్తోంది.

5 / 8
<p>కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు.

6 / 8
<p>పీఎం కిసాన్‌ కింద(20వ విడత) ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేస్తారు. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5 వేల చొప్పున జమ చేయనుంది. అంటే తొలి విడతలో ఏపీలోని రైతుకు రూ.7 వేలు అందుతాయి.జూలై 18వ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే… దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవ నిధులను జత చేస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

పీఎం కిసాన్‌ కింద(20వ విడత) ఒక్కో రైతు కుటుంబానికి రూ.2వేల చొప్పున విడుదల చేస్తారు. దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5 వేల చొప్పున జమ చేయనుంది. అంటే తొలి విడతలో ఏపీలోని రైతుకు రూ.7 వేలు అందుతాయి.జూలై 18వ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే… దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవ నిధులను జత చేస్తుంది.

7 / 8
<p>ఇక రెండో విడతగా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.7వేలు, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం రూ.4వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.6వేలను రైతుల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. పీఎం కిసాన్ నిధులతో పాటే ఈ డబ్బులు కూడా వస్తాయి. </p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

ఇక రెండో విడతగా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.7వేలు, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం రూ.4వేలు, కేంద్రం రూ.2వేలు కలిపి రూ.6వేలను రైతుల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. పీఎం కిసాన్ నిధులతో పాటే ఈ డబ్బులు కూడా వస్తాయి.

8 / 8
<p>రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jul 10, 2025 04:26 pm IST

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మొత్తం 3 విడతల్లో డబ్బులను జమ చేస్తారు. ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!