అన్నాచెల్లెళ్ల అనుబంధానికి చిహ్నంగా నిలిచే రక్షాబంధన్ పండుగ తేదీపై ఉన్న ఉత్కంఠ వీడింది. ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ, చంద్రగ్రహణం, భద్ర తదితర యోగాల నేపథ్యంలో రాఖీ ఎప్పుడు కట్టాలనే దానిపై స్పష్టత వచ్చేసింది.
శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన్ ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయంలో శ్రావణ పూర్ణిమకు అత్యంత విశిష్టత ఉంది. ఈ పవిత్ర రోజునే దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. సోదరుడి క్షేమం కోరుతూ సోదరి కట్టే రక్షా రేఖ వారి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం ప్రారంభమై, ఆగస్టు 28, 2026 ఉదయం వరకు కొనసాగుతుంది. అయితే పండుగ ఆచారాల ప్రకారం ఉదయ తిథి, భద్ర రహిత కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.
రాఖీ ఎప్పుడు కట్టాలి?
శాస్త్ర ప్రకారం పండుగలను ఉదయ తిథిలో ఆచరించడం ఆనవాయితీ. ఆగస్టు 27న పూర్ణిమ తిథితో పాటు చంద్రోదయం ఉండటంతో ఆ రోజు శ్రావణ పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే రక్షాబంధన్ విషయానికి వస్తే భద్ర లేని పూర్ణిమను ఉత్తమంగా భావిస్తారు. ఆగస్టు 27 రోజంతా భద్ర ప్రభావం ఉండటంతో ఆ రోజు రాఖీ కట్టడం నిషిద్ధం. ఆగస్టు 28 ఉదయానికి భద్ర ముగియడంతో పాటు ఉదయవ్యాపి పూర్ణిమ లభిస్తుంది. అందువల్ల ఆగస్టు 28నే రక్షాబంధన్ జరుపుకోవడం శ్రేయస్కరం అని ప్రముఖ జ్యోతిష్యులు పండిత నరేంద్ర ఉపాధ్యాయ వెల్లడించారు.
ఆగస్టు 28న రాఖీ కట్టడానికి శుభ ముహూర్తాలు
ఆగస్టు 28న భద్ర లేకపోవడంతో రోజంతా పండుగ జరుపుకోవడానికి వీలవుతుంది. అయినప్పటికీ అత్యంత శుభప్రదమైన సమయాల్లో రాఖీ కట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
ఉత్తమ ముహూర్తం: ఉదయం 05:57 గంటల నుంచి ఉదయం 09:48 గంటల వరకు.
మధ్యాహ్న ముహూర్తం: మధ్యాహ్నం 12:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు.
ఈ ముహూర్తాల్లో సోదరులకు రాఖీ కట్టడం అత్యంత శుభప్రదం. అయితే ఈ సమయంలో రాహుకాలం (ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు) గమనించి దాన్ని మినహాయించి ముహూర్తాన్ని ఎంచుకోవాలి.
చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందా?
ఆగస్టు 28న ఈ ఏడాది రెండోది, చివరిదైన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 06:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:32 గంటలకు ముగియనుంది. అయితే ఈ గ్రహణం పగటిపూట సంభవించనున్న కారణంగా భారతదేశంలో కనిపించదు. గ్రహణం దృశ్యమానం కాని కారణంగా ఎలాంటి సూతక్ కాలం వర్తించదు. కాబట్టి రక్షాబంధన్ పండుగపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. భయం లేకుండా పండుగను జరుపుకోవచ్చు.
{{/usCountry}}ఆగస్టు 28న ఈ ఏడాది రెండోది, చివరిదైన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 06:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:32 గంటలకు ముగియనుంది. అయితే ఈ గ్రహణం పగటిపూట సంభవించనున్న కారణంగా భారతదేశంలో కనిపించదు. గ్రహణం దృశ్యమానం కాని కారణంగా ఎలాంటి సూతక్ కాలం వర్తించదు. కాబట్టి రక్షాబంధన్ పండుగపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. భయం లేకుండా పండుగను జరుపుకోవచ్చు.
{{/usCountry}}