...
...
Next Story

ఆచార్య చాణక్యుల ప్రకారం.. జీవితంలో ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే నష్టపోవాల్సిందే!

ఆచార్య చాణక్యుడు తన నీతుల ద్వారా జీవితంలో ఎప్పుడు వినయంగా ఉండాలి, ఎప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి అనే విషయాలను వివరించారు. ముఖ్యంగా ధన లావాదేవీలు, విద్యాభ్యాసం, ఆహారం, మాటలు మరియు వ్యవహారాల్లో అనవసరమైన మొహమాటం మనకే నష్టం కలిగిస్తుందని సూచించారు.

Published on: Sep 11, 2026, 09:30:19 IST
Advertisement

జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆచార్య చాణక్యుడి నీతులు ఎప్పుడూ దిశానిర్దేశం చేస్తుంటాయి. ఆయన చెప్పిన మార్గాలను అనుసరించడం కొంచెం కష్టంగా అనిపించినా, వాటిని ఆచరణలో పెట్టిన వారు జీవితంలో ఎన్నటికీ వెనుకడుగు వేయరు. మనిషి ఏయే సందర్భాల్లో సంకోచాన్ని వదిలి ధైర్యంగా, ముక్కుసూటిగా వ్యవహరించాలో చాణక్యుడు స్పష్టంగా వివరించారు. ఏ విషయంలో వినయంగా ఉండాలో, ఏ రంగంలో తెగింపు అవసరమో తెలుసుకోవడం ద్వారానే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఓ శ్లోకం ద్వారా చాణక్యుడు అందరికీ ఉపయోగపడే విషయాలను అద్భుతంగా వివరించారు.

ఈ విషయాల్లో ఎప్పుడు మొహమాటం వద్దు.. చాలా సమస్యలు వస్తాయి

ఆచార్య చాణక్యుల ప్రకారం.. జీవితంలో ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే నష్టపోవాల్సిందే!
ఆచార్య చాణక్యుల ప్రకారం.. జీవితంలో ఈ 4 విషయాల్లో సిగ్గుపడితే నష్టపోవాల్సిందే!

1.ధన లావాదేవీలలో సంకోచం వద్దు

డబ్బు లేదా ధాన్యానికి సంబంధించిన లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలలో ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అడగడంలో, వ్యాపార లెక్కలు సరిచూసుకోవడంలో, జీతాల గురించి మాట్లాడేటప్పుడు మొహమాటం కూడదు. ఇక్కడ సిగ్గుపడితే ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడంలో తెగింపు ఉండాలి.

2.విద్యను ఆర్జించేటప్పుడు సిగ్గు దండగ

జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియలో గుడ్డి సంకోచం విద్యార్థి ఉనికిని దెబ్బతీస్తుంది. మనసులో మెదిలే సందేహాలను నివృత్తి చేసుకునేటప్పుడు, కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు సిగ్గుపడేవారಿಗೆ పరిపూర్ణ జ్ఞానం లభించదు. విద్య నేర్చుకోవడానికి వయసుతో లేదా హోదాతో సంబంధం లేదు. మనకంటే చిన్నవారైనా, కిందిస్థాయిలో ఉన్నవారైనా నేర్చుకోవడంలో తప్పు లేదు. గురువును ప్రశ్నలు అడగకుండా మౌనంగా ఉంటే అజ్ఞానమే మిగులుతుంది.

3.ఆహార విషయంలో మొహమాటం తగదు

స్నేహితులు, బంధువులు లేదా ఇతరుల ఇళ్లకు వెళ్లినప్పుడు భోజనం చేసేటప్పుడు అనవసరమైన సిగ్గు అడ్డుపెట్టుకోకూడదు. ఆకలిగా ఉన్నప్పటికీ ఇతరులు ఏమనుకుంటారోనని తక్కువగా తినడం లేదా భోజనాన్ని వదులుకోవడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తగిన పోషణ అందించడంలో ఎప్పుడూ మొహమాటం చూపరాదు.

4.వ్యవహారాలు, మాటల్లో స్పష్టత ముఖ్యం

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks