జగన్నాథ రథయాత్ర జులై 16వ తేదీ గురువారం నాడు ప్రారంభమై జులై 24వ తేదీ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జగన్నాథ స్వామి తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడు మూడు వేర్వేరు రథాలపై గుండిచా ఆలయానికి ప్రయాణిస్తారు. నలుమూలల నుండి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. ఈ రథయాత్ర గురించి మీరు తెలుసుకోవలసిన అనేక ప్రత్యేక విషయాలు ఉన్నాయి. వాటిని భక్తులు తప్పక తెలుసుకోవాలి. జగన్నాథ రథయాత్రలోని ప్రత్యేక విషయాలను 10 పాయింట్లలో వివరంగా తెలుసుకోండి.

1. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం ద్వితీయ తిథి నాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం నుండి మొదలవుతుంది. జగన్నాథుడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర కోసం మూడు వేర్వేరు రథాలను సిద్ధం చేస్తారు. ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
2. రథాలను తయారు చేయడానికి చాలా ప్రత్యేకమైన కలపను ఉపయోగిస్తారు. సాల్, వేప, సింబల్, మరియు ధౌరా చెట్ల కలపను ఉపయోగిస్తారు. ఈ రథయాత్ర కోసం శుభప్రదమైన చెట్లను ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, వాటితో రథాలను తయారు చేస్తారు. ఈ కలపలను దారు అని పిలుస్తారు.
3. రథయాత్రలోని మూడు రథాలు వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష లేదా గరుడధ్వజ అని పిలుస్తారు. బలరాముని రథాన్ని తలధ్వజ అని, సుభద్ర దేవి రథాన్ని దర్పదాలన్.. దీనినే పద్మ రథం అని పిలుస్తారు.
4. రథ నిర్మాణంలో మేకుల వంటి పదునైన వస్తువులను ఉపయోగించరని అంటారు. వసంత పంచమి నాడు కలప ఎంపిక మొదలవుతుంది. దీని తర్వాత అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలవుతుంది.
5. రథయాత్ర ఐదో రోజున లేదా హేరా పంచమి నాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై గుండిచా ఆలయానికి వస్తుంది. అక్కడ ఆమె జగన్నాథుని నందిఘోష రథచక్రాన్ని విరగ్గొడుతుంది. స్వామి చాలా కాలం పాటు ఆమెను విడిచిపెట్టి, తన మేనత్త ఇంటికి వెళ్లినందున ఇలా చేస్తుందని నమ్మకం.
{{/usCountry}}5. రథయాత్ర ఐదో రోజున లేదా హేరా పంచమి నాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై గుండిచా ఆలయానికి వస్తుంది. అక్కడ ఆమె జగన్నాథుని నందిఘోష రథచక్రాన్ని విరగ్గొడుతుంది. స్వామి చాలా కాలం పాటు ఆమెను విడిచిపెట్టి, తన మేనత్త ఇంటికి వెళ్లినందున ఇలా చేస్తుందని నమ్మకం.
{{/usCountry}}6. ఈ రథయాత్ర సమయంలో జగన్నాథ స్వామి ఒక వారం పాటు తన మేనత్త ఇంట్లో ఉండి, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం దశమ రోజున గుండిచా ఆలయానికి తిరిగి వస్తారు. దీనిని బహుదా యాత్ర అని అంటారు. మూడు రోజుల పాటు స్వామివారు ఆలయం వెలుపల తన భక్తులకు దర్శనమిచ్చి, ఆ తర్వాత తన ఆలయ గర్భగుడిలోకి తిరిగి వెళ్తారు.
7. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జగన్నాథ స్వామి లక్ష్మీదేవి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని నమ్ముతారు. గర్భగుడిలోకి ప్రవేశం లభించడానికి ముందు స్వామి ఆగ్రహించిన లక్ష్మీదేవిని శాంతింపజేయవలసి వచ్చింది. దీనినే నీలాద్రి విజయం అని అంటారు.
8. ఈ రథయాత్ర సమయంలో జగన్నాథుని రథం సాల్బేగ్ అనే ముస్లిం భక్తుని సమాధి వద్ద కూడా ఆగుతుందని చెబుతారు. ఈ భక్తుని తల్లి హిందువు, తండ్రి మొఘల్ సైనికుడు.
9. ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం నుండి ప్రారంభమయ్యే రథయాత్ర సమయంలో రథం పూర్తి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గుండిచా ఆలయానికి చేరుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు సమయం పట్టవచ్చు. కొన్నిసార్లు, రథం మరుసటి రోజు ఆలయానికి చేరుకుంటుంది.
10. రథయాత్రకు సంబంధించి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఈ రథం తాడులను లాగిన వారు పాపాల నుండి విముక్తి పొంది హరిలోకంలో స్థానం పొందుతారు. అందుకే రథయాత్ర సమయంలో రథాన్ని లాగడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.