...
...
Next Story

నిర్జల ఏకాదశి: ఆ రోజు ఇలా చేస్తే చాలా మంచిది.. పుణ్యఫలం దక్కాలంటే ఈ పనులు అస్సలు చేయకండి!

ఏడాది పొడవునా వచ్చే ఏకాదశి తిథుల్లో అత్యంత పవిత్రమైనది, విశిష్టమైనది నిర్జల ఏకాదశి. ఎటువంటి ఆహారం, నీరు తీసుకోకుండా ఆచరించే ఈ కఠిన వ్రతం, ఏడాదిలో మిగిలిన అన్ని ఏకాదశుల ఫలితాన్ని ఒకేసారి ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.

Published on: Jun 21, 2026, 15:25:46 IST
Advertisement

ఈ ఏడాది జూన్ 25న వచ్చింది. నిర్జల ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, మనసును, మాటను అదుపులో ఉంచుకోవడం. ఈ రోజున చేసే ప్రతి చిన్న పని కూడా భగవంతుని ఆరాధనలో భాగమే. వ్రత దీక్షలో ఉన్నవారు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి:

కోపం, వాదనలకు దూరంగా ఉండండి

నిర్జల ఏకాదశి: ఆ రోజు ఇలా చేస్తే చాలా మంచిది.. పుణ్యఫలం దక్కాలంటే ఈ పనులు అస్సలు చేయకండి!
నిర్జల ఏకాదశి: ఆ రోజు ఇలా చేస్తే చాలా మంచిది.. పుణ్యఫలం దక్కాలంటే ఈ పనులు అస్సలు చేయకండి!

మనసులో అశాంతి ఉంటే భగవంతునిపై ధ్యాస నిలవదు. అందుకే ఏకాదశి రోజున ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి. చిన్నపాటి అసహనం కూడా వ్రత భంగం కలిగించవచ్చు. ఆ రోజు మొత్తం ప్రశాంతంగా, మౌనంగా లేదా దైవ నామస్మరణతో గడపడం ఉత్తమం.

అబద్ధాలలు చెప్పకూడదు

నిజాయితీకి మించిన ఆరాధన మరొకటి లేదు. ఈ పవిత్రమైన రోజున అసత్యాలు పలకడం, ఇతరులను తప్పుదోవ పట్టించడం వంటి పనులు చేయకండి. మీరు మాట్లాడే ప్రతి మాట మృదువుగా, సత్యబద్ధంగా ఉండేలా చూసుకోండి.

పెద్దల పట్ల గౌరవం

ఇంట్లో పెద్దవారు, ఆశ్రితలు లేదా తోటి వ్యక్తులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించండి. కఠినమైన పదాలను వాడటం వల్ల మనశ్శాంతి దెబ్బతినడమే కాకుండా, మన చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం కూడా దెబ్బతింటుంది.

అనాచారాలకు చోటు లేదు

ఏకాదశి అంటేనే సాత్వికానికి మారుపేరు. ఈ రోజున మన ఆహారపు అలవాట్లపై పూర్తి నియంత్రణ ఉండాలి. మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండటమే కాకుండా, తామసిక ఆహార పదార్థాలకు కూడా విరామం ఇవ్వాలి. అలాగే, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసిని, ఈ రోజున తెంపకూడదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి, పూజ కోసం అవసరమైన తులసి దళాలను ఒక రోజు ముందుగానే సేకరించి ఉంచుకోవడం మంచిది.

నిర్జల ఏకాదశి ఎందుకు విశేషమైనది?

ముగింపుగా చెప్పాలంటే, భక్తి అనేది మన ప్రవర్తనలో కనిపించాలి. ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తూ, అంతరాత్మను శుద్ధి చేసుకున్నప్పుడే ఏకాదశి వ్రతం పరిపూర్ణమవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe