ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటిని చిలకరించి కడుగుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసుకోండి!
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజూ ఉదయం నీళ్లు చల్లడం శుభప్రదంగా భావిస్తారు. ఇది కేవలం పరిశుభ్రత కోసం మాత్రమే కాకుండా, ఇంట్లో సానుకూల శక్తిని పెంచి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుందని నమ్మకం. గడప శుభ్రంగా ఉండటం సుఖశాంతులు, ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం వద్ద నీళ్లు చల్లడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. దరిద్రం తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ చిన్న చిట్కాతో మీ ఇంట్లో సానుకూల శక్తిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే మన పెద్దలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లే అలవాటు ఉండేది. ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప వాస్తు రహస్యాలు దాగి ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని, ముఖద్వారం శుభ్రంగా ఉండి, నీటితో తడిసి ఉన్న ఇళ్లకు ఆమె ప్రాధాన్యతనిచ్చి అడుగుపెడుతుందని విశ్వాసం. గడప వద్ద అపరిశుభ్రత ఉంటే అది దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీకటాక్షం కోసం మనం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లడం వల్ల కలిగే ప్రయోజనాలు
వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడప వద్ద నీళ్లు చల్లడం వల్ల అనేక దోషాలు నివారించబడతాయి:
లక్ష్మీదేవి కటాక్షం: ఇంటి గడపను శుభ్రం చేసి నీళ్లు చల్లడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
రాహు దోష నివారణ: వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం వద్ద రాహువు ప్రభావం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం నీళ్లు చల్లడం ద్వారా రాహు దోషాలు, అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, ఇంట్లో గొడవలు దూరమవుతాయి.
పితృ దేవతల అనుగ్రహం: ఉదయపు వేళ పితృదేవతలు ఇంటి గడప గుండా ప్రయాణిస్తుంటారని శాస్త్రం చెబుతోంది. అక్కడ నీటిని సమర్పించడం ద్వారా వారు తృప్తి చెంది, మనకు ఆశీస్సులను అందిస్తారు.
నకారాత్మక శక్తి విముక్తి: రాత్రంతా ఇంటి బయట పేరుకుపోయిన ప్రతికూల శక్తులు ఉదయం మనం చల్లే నీటితో నశించిపోతాయి. ఆ నీటిలో కాస్త గంగాజలం లేదా గులాబీ నీళ్లు కలిపితే మరింత శుభప్రదంగా మారుతుంది.
ఇంట్లో సిరిసంపదలు రావాలంటే పాటించాల్సిన వాస్తు చిట్కాలు
కేవలం నీళ్లు చల్లడమే కాదు, గడపను గౌరవించడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు:
శుభ చిహ్నాలు: ఉదయం గడపను శుభ్రం చేశాక, ఇరువైపులా సింధూరం లేదా కుంకుమతో 'స్వస్తిక్' లేదా 'శుభ-లాభ్' గుర్తును గీయండి. పైన 'ఓం' అని రాయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
దీపారాధన: ప్రతిరోజూ సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది.
పరిశుభ్రత ముఖ్యం: ఇంటి గడపకు ఎదురుగా ఎప్పుడూ చెత్త కుప్పలు, చెప్పులు, బూట్ల స్టాండ్లను ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది.
గడపకు నమస్కారం: ఉదయాన్నే ఇంటి గడపను శుభ్రం చేశాక, దానికి నమస్కరించడం ఒక అలవాటుగా చేసుకోండి. దీనివల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


