రాహు కేతు సంచారం : డిసెంబరులో అకస్మాత్తుగా పెరగనున్న ఆదాయం..! ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి

డిసెంబరులో రాహు, కేతువుల గ్రహ సంచారం జరగనుంది. ఫలితంగా మేషం, సింహం, కన్య, మీన రాశుల జాతకులకు అపారమైన ఆర్థిక లాభాలు, కెరీర్‌లో ఊహించని పురోగతి లభించనున్నాయి.

Published on: Jun 16, 2026, 07:40:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన, నెమ్మదిగా కదిలే ఛాయా గ్రహాలైన రాహు కేతువుల సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. డిసెంబరు నెలలో ఈ రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాల్లో అనేక హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా రాహువు, కేతువుల సంచారం ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలను, నష్టాలను కలిగిస్తుందో ముందే తెలుసుకోవడం వల్ల అప్రమత్తంగా ఉండవచ్చు.

Rahu ketu gochat december 2026
Rahu ketu gochat december 2026

ముందుగా ఈ రెండు గ్రహాల సంచార వివరాలను పరిశీలిస్తే, డిసెంబరు 5వ తేదీన రాహువు శని దేవుడికి చెందిన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజున కేతువు కూడా చంద్రుడికి అధిపతి అయిన కర్కాటక రాశిలోకి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ క్రమంలో మేషం నుండి మీనం వరకు ఉన్న అన్ని రాశుల వారిపై ఈ ప్రభావం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక రాశుల వారికి మాత్రం ఈ సంచారం అపారమైన ధనలాభాన్ని, అదృష్టాన్ని తీసుకురాబోతోంది.

  • మేష రాశి : రాహువు మీ రాశికి చెందిన పని, వ్యాపార స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అయితే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం మంచిది.
  • కన్యా రాశి : కన్యా రాశికి చెందిన 11వ ఇల్లు లాభ స్థానంగా భావిస్తారు. రాహువు ఈ స్థానంలోకి వెళ్లడం వల్ల ప్రారంభంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చివరికి భారీ ప్రయోజనాలే దక్కుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకు ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. ఈ రాహు సంచారం మీకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా మారుతుంది.
  • సింహ రాశి : ఈ రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. మీ రాశి నుండి 12వ ఇంట్లో ఈ గ్రహ సంచారం జరుగుతోంది. దీనివల్ల సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు, వ్యాధులు నయమవుతాయి. మునుపటి కంటే మెరుగైన శారీరక, మానసిక స్థితిని పొందుతారు. గతంలో మిమ్మల్ని వ్యతిరేకించిన వారు, శత్రువులుగా మారిన వారు ఇప్పుడు మీతో స్నేహపూర్వకంగా ఉంటారు.
  • మీన రాశి : ఈ రాశి వారికి 11వ ఇంట్లో ఈ గ్రహ సంచారం జరుగుతుంది. దీని ప్రభావంతో మీ మనసులో చాలా కాలంగా ఉన్న కోరికలు అకస్మాత్తుగా నెరవేరుతాయి. ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

రాహు కేతువుల ప్రాధాన్యత…?

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…. రాహు, కేతువులను నీడ గ్రహాలు లేదా ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకవైపు కేతువు మనిషిని ఆధ్యాత్మికత, నిర్లిప్తత, మోక్షం వైపు నడిపిస్తూ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక రహస్యాలను అందిస్తాడు. మరోవైపు రాహువు మానవ మనస్సును శాసిస్తాడు. తీవ్రమైన కోరికలను పెంచడం, మానసిక గందరగోళాన్ని సృష్టించడం రాహువు నైజం. రాహువు వల్లనే జీవితంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలు, నష్టాలు, ప్రమాదాలు లేదా కెరీర్‌లో పెద్ద మార్పులు సంభవిస్తాయి. అందుకే ఈ రెండు గ్రహాల సంచారం మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ప్రస్తుత ఆధునిక కాలంలో రాహువు ప్రభావం డిజిటల్ ప్రపంచంపై ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సోషల్ మీడియా వంటి డిజిటల్ వస్తువులకు ఎక్కువగా బానిస కావడం రాహు ప్రభావమే. డిజిటల్ జీవితంలో మునిగిపోవడం వల్ల చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషులను మనం మర్చిపోతుంటాం. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి 'డిజిటల్ డిటాక్స్' చేయడం చాలా అవసరం. అంటే రోజులో కొంత సమయం ఫోన్లకు, గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలి. రాహువు మనస్సులో విపరీతమైన కోరికలను, భ్రమలను కలిగిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. సోమరితనాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. సాధారణంగా రాహువు ప్రభావం వల్ల ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.

రాహువు యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించవచ్చు. శివుడి రూపమైన భైరవుడిని మరియు దుర్గామాతను భక్తితో పూజించడం వల్ల మేలు జరుగుతుంది. రాహువు అనేది ఒక ఆలోచనా విధానానికి ప్రతీక. కాబట్టి కేవలం పరిహారాలు చేయడమే కాకుండా, మన దైనందిన అలవాట్లను కూడా మెరుగుపరుచుకోవాలి. నివాస పరిసరాలను, మనస్సును ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిత్యం రాహు మంత్రాన్ని పఠించడం ద్వారా రాహు దోషాల నుండి సులభంగా విముక్తి పొందవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More