హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందునా పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి ఆధ్యాత్మికంగా విశేషమైన స్థానం ఉంది. ఈ ఏకాదశి రోజున భోళా శంకరుడితో పాటు జగత్ప్రభువైన శ్రీమహావిష్ణువును ఏకకాలంలో పూజించే అరుదైన భాగం దక్కుతుంది. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి వేడుకలకు రంగం సిద్ధమైంది. భక్తులు ఈ పవిత్ర దినం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తేదీ, శుభ ముహూర్తాలు

ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న ప్రారంభమై, ఆగస్టు 24న తెల్లవారుజామున 4 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం ఆగస్టు 23వ తేదీనే ఏకాదశి వ్రతం ఆచరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పవిత్ర రోజున సిద్ధ యోగం, పూర్వాషాఢ నక్షత్రం యొక్క అద్భుతమైన కలయిక కుదురుతోంది. ఈ శుభ సంయోగం వల్ల పూజా ఫలం రెట్టింపు అవుతుందని నమ్ముతారు. శ్రీహరికి ఏకాదశి తిథి అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ముఖ్యంగా చాతుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి.
ఎవరు ఆచరించాలి? వ్రత నియమాలు
సంవత్సరంలో రెండుసార్లు పుత్రదా ఏకాదశి వస్తుంది. ఒకటి శ్రావణ మాసంలో రాగా, మరొకటి పుష్య మాసంలో వస్తుంది. శ్రావణ మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. సంతాన సౌభాగ్యాన్ని కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. పుత్రదా ఏకాదశి కథ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సంతానం లేని ఓ రాజు రుషుల సలహా మేరకు ఈ వ్రతం ఆచరించి సంతాన సౌభాగ్యాన్ని పొందాడు.
ఈ వ్రతాన్ని అత్యంత నిష్టతో పాటించాలి. ద దశమి నాటి నుంచి ద్వాదశి వరకు మూడు రోజుల పాటు కఠినమైన నియమాలను పాటించడం ఆచారంగా వస్తోంది. సాత్విక ఆహారం తీసుకుంటూ, మనసా వాచా కర్మణా దైవ స్మరణలో గడపాలి.
దీపదాన మహత్యం
{{/usCountry}}ఈ వ్రతాన్ని అత్యంత నిష్టతో పాటించాలి. ద దశమి నాటి నుంచి ద్వాదశి వరకు మూడు రోజుల పాటు కఠినమైన నియమాలను పాటించడం ఆచారంగా వస్తోంది. సాత్విక ఆహారం తీసుకుంటూ, మనసా వాచా కర్మణా దైవ స్మరణలో గడపాలి.
దీపదాన మహత్యం
{{/usCountry}}ఈ పవిత్ర రోజున దీపదానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పవిత్ర నదులు, సరోవరాల దగ్గర లేదా తులసి చెట్టు కింద, రావి చెట్టు మొదట్లో దీపాలు వెలిగిస్తే విశేష ఫలితం దక్కుతుంది. దీప దానం కోసం గోధుమ పిండితో ప్రత్యేకంగా దీపం తయారు చేసి, అందులో ఆవు నెయ్యి పోసి దూది వత్తితో వెలిగించాలి. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే వ్రత సమాప్తి తర్వాత బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం శ్రేయస్కరం.
వ్రత విరమణ
ఏకాదశి వ్రతాన్ని ముగించే విధానాన్ని పారణ అంటారు. ద్వాదశి తిథి రోజున అంటే ఆగస్టు 24న ఏకాదశి వ్రత పారణ చేస్తారు. ఎప్పుడూ ద్వాదశి యుక్త ఏకాదశినే పరిగణలోకి తీసుకోవాలి తప్ప, దశమి యుక్త ఏకాదశి రోజున వ్రతం చేయకూడదని శాస్త్రం చెబుతోంది.