Saphala Ekadashi vrata katha: ఈరోజే సఫల ఏకాదశి, ఈ కథ వింటే అన్నింటా శుభ ఫలితాలే.. కార్యసిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి!
Saphala Ekadashi vrata katha: సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలనే సఫల ఏకాదశి నాడు వీటిని పాటించడం జరుగుతుంది. అయితే సఫల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించే వారు తప్పక వ్రత కథ చదువుకోవాలి.
Saphala Ekadashi vrata katha: సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలనే సఫల ఏకాదశి నాడు వీటిని పాటించడం జరుగుతుంది. అయితే సఫల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించే వారు తప్పక వ్రత కథ చదువుకోవాలి. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Saphala Ekadashi vrata katha: ఈరోజే సఫల ఏకాదశి, ఈ కథ వింటే అన్నింటా శుభ ఫలితాలే (pinterest)
సఫల ఏకాదశి వ్రత కథ:
ఈ సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని శివుడు స్వయంగా పార్వతి దేవికి చెప్పాడని పద్మ పురాణంలో చెప్పబడింది. సఫల ఏకాదశి నాడు ఈ వ్రత కథను చదువుకుని, శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణమవుతుంది. వ్రత ఫలితాన్ని పొందవచ్చు.
కృష్ణుడు పాండవులకు చెప్పిన కథ:
సఫల ఏకాదశి నాడు జాగరణ చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. ఈ వ్రతానికి సమానమైన యజ్ఞం లేదు, తీర్థం లేదు. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను కృష్ణుడు పాండవులకు చెప్పాడని పురాణాలు తెలుపుతున్నాయి.
పూర్వము చంపావతి రాజ్యం అన్న మాహిష్మంతుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడు. అతనికి లుంబకుడు అనే కొడుకు ఉండేవాడు. అయితే లుంబకుడు చెడు సహవాసాలతో ఎప్పుడూ అధర్మంలో జీవించేవాడు. కుమారుణ్ని వదిలేయకుండా ఆ రాజు అతనికి రాజబహిష్కరణ శిక్ష విధించాడు. దీంతో రాజు కొడుకు లొంబకుడు అడవులు పాలయ్యాడు. ఆహారం లేక తన పరిస్థితిని చూసి పశ్చాత్తాపపడ్డాడు. ఒక మఱ్ఱి చెట్టు దగ్గరికి వెళ్లి రాత్రంతా అక్కడే గడిపి, ఏమీ తినకుండా స్పృహ తప్పి పడిపోయాడు.
ఉపవాస ఫలితం:
లుంబకుడు ఆహారం లేకుండా అలా స్పృహ తప్పి పడిపోయిన రోజు అనుకోకుండా సఫల ఏకాదశి. ఏకాదశి నాడు ఏ ఆహారము లేక అప్రయత్నంగా ఉపవాసం చేశాడు. దీంతో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. లొంబకునికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత లుంబకుడు ధర్మ మార్గంలో పరిపాలన కొనసాగించాడు. మరణానంతరం వైకుంఠాన్ని చేరుకున్నాడు.
స్వయంగా పాండవులు చేసిన వ్రతం:
పాండవులు అరణ్య వాసం చేసినప్పుడు ఈ కథను కృష్ణుడు పాండవులకు చెప్పి, వారి చేత ఈ వ్రతాన్ని చేయించాడు. దీంతో వారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. అందుకనే తెలిసి కానీ తెలియక కానీ ఈ సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కార్యసాఫల్యత ఉంటుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కృష్ణుడు పాండవులకు ఈ కథను తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథను చదివినా, విన్నా కూడా కార్యసిద్ధి కలుగుతుంది.