...
...
Next Story

కన్యా రాశిలోకి సూర్యుడు - సెప్టెంబర్ 17 నుంచి ఈ 5 రాశులవారి జాతకం మారబోతోంది! అదృష్టం మీవైపే..!

సెప్టెంబర్ 17న జరిగే సూర్య గోచారంతో సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతితో పాటు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసే అవకాశాలు ఉన్నాయి.

Published on: Sep 10, 2026, 15:09:01 IST
Advertisement

గ్రహాలకు రాజుగా భావించే సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ క్రమంలో 2026 సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశి నుంచి నిష్క్రమించి…. కన్యా రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. కన్యా రాశికి అధిపతి బుధుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి, బుధుడికి మధ్య మైత్రి భావం ఉంటుంది. మిత్రుని రాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఈ ఘట్టాన్ని కన్యా సంక్రాంతి అని పిలుస్తారు.

కన్యా రాశిలోకి సూర్యుడు
కన్యా రాశిలోకి సూర్యుడు

సూర్య భగవానుడు అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు కన్యా రాశిలోనే సంచరిస్తాడు. జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. సూర్యుడు ఆత్మవిశ్వాసం, సమాజంలో గౌరవ ప్రతిష్టలు, పితృ కారకుడిగా వ్యవహరిస్తాడు. ఈ సంచార ప్రభావం మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపైనా ఉంటుంది. అయితే, ముఖ్యంగా ఐదు రాశుల వారికి మాత్రం ఈ సమయం అత్యంత శ్రేష్ఠంగా మారబోతోంది. వీరికి ఆర్థిక లాభాలతో పాటు కెరీర్‌లో అత్యున్నత విజయాలు, విదేశీ లేదా విమాన ప్రయాణాలు, కుటుంబంలో సుఖశాంతులు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సింహ రాశి :

ఈ రాశి వారికి సూర్యుని రాశి మార్పు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో జీవితంలో ఆనందం పెరుగుతుంది. బంధువులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది సరైన సమయం. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరిధి విస్తరిస్తుంది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కొత్త విజయాలు సాధిస్తారు. రాబడికి కొత్త మార్గాలు తోడవ్వడమే కాకుండా, భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి.

కన్యా రాశి :

సూర్యుడి రాశి మార్పు వృశ్చిక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది సరైన సమయం. ఆఫీసులో పనితీరు మెరుగవుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవ్వడమే కాకుండా, పాత వనరుల నుంచి కూడా నిరంతరం డబ్బు అందుతూనే ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. మీ సుదీర్ఘ కలలు నెరవేరే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి సూర్య సంచారం శుభ సంకేతాలను ఇస్తోంది. భౌతిక సుఖాలు, సంతోషాలు పెరుగుతాయి. ఆత్మీయులు, మిత్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్తగా భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. కోర్టు వివాదాలు, న్యాయపరమైన చిక్కుల నుంచి ఉపశమనం లభించి విజయం మీ సొంతమవుతుంది. ఆర్థిక ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. కార్యాలయంలో ఆశించిన ఫలితాలు సాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు.

మీన రాశి :

మీన రాశి వారికి సూర్యుని మార్పు అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ మాట తీరు ఎంతో మృదువుగా మారుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడటంతో ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. వ్యాపారవేత్తలు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ఒప్పందాలు లేదా క్లయింట్ డీల్స్‌పై సంతకాలు చేసే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. తండ్రి నుంచి పూర్తి మద్దతు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks