ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. ఈ సంవత్సరము జయ ఏకాదశి జనవరి 29, అనగా ఈరోజు వచ్చింది. దీనిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. భూమి ఏకాదశి అని కూడా పేరు ఉంది. పైగా ఈ విశేషమైన రోజున రవి యోగం కూడా ఏర్పడబోతోంది. ఇది మరింత శుభప్రదమైనది.
ఏకాదశి

ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. ఇక ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే చాలా మంది వారి రాశి ప్రకారం పరిహారాలను పాటిస్తూ ఉంటారు. మరి ఈ జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి వేళ ఏ రాశి వారు వేటిని పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
జయ ఏకాదశి 2026.. 12 రాశుల వారు ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి
మేష రాశి:
మేష రాశి వారు ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించండి. పసుపు, చందనం, బెల్లాన్ని సమర్పిస్తే మంచిది.
వృషభ రాశి:
వృషభ రాశి వారు అన్నింటా జయలే కలగాలంటే ఈ విశేషమైన జయ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణకు పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇది శుభ ఫలితాలను తీసుకువస్తుంది.
మిథున రాశి:
మిథున రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది. అలాగే పశువులకు పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వండి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ విశేషమైన రోజున శివకేశవులను ఆరాధించాలి. అదే విధంగా పేదవారికి అన్నాన్ని దానంగా ఇస్తే మంచిది.
సింహ రాశి:
{{/usCountry}}కర్కాటక రాశి వారు ఈ విశేషమైన రోజున శివకేశవులను ఆరాధించాలి. అదే విధంగా పేదవారికి అన్నాన్ని దానంగా ఇస్తే మంచిది.
సింహ రాశి:
{{/usCountry}}సింహ రాశి వారు మహావిష్ణువుకు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి, ఎర్రటి పూలతో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆనందంగా ఉండవచ్చు.
కన్య రాశి:
కన్య రాశి వారు జయ ఏకాదశి నాడు విష్ణువుకు తులసిదళాలను సమర్పించాలి. పసుపు రంగు పండ్లను నైవేద్యంగా పెడితే మంచిది.
తులా రాశి:
తులా రాశి వారు లక్ష్మీదేవికి పసుపు వస్త్రాలు, గాజులను సమర్పించాలి. అలాగే లక్ష్మీదేవిని, విష్ణువును మనస్ఫూర్తిగా ఆరాధించాలి.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈ జయ ఏకాదశి నాడు విష్ణువును పూజిస్తూ సుందరకాండ పారాయణం చేయడం మంచిది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు జయ ఏకాదశి నాడు విష్ణువుకు స్వీట్లు నైవేద్యంగా పెట్టి, సత్యనారాయణ వ్రత కథను చదువుకోవడం మంచిది.
మకర రాశి:
మకర రాశి వారు జయ ఏకాదశి నాడు మహావిష్ణువును పూజించాలి. దుప్పట్లు, ఆహారాన్ని దానం చేయడం మంచిది.
కుంభ రాశి:
కుంభ రాశి వారు విష్ణువుకు పసుపు పాలు సమర్పించాలి. “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచి జరుగుతుంది.
మీన రాశి:
మీన రాశి వారు విష్ణువుకు పసుపు వస్త్రాలను సమర్పించి, పసుపు రంగులో ఉండే పుష్పాలతో విష్ణువును భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.