ఈరోజు కార్తీక సోమవారం వేళ సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే, శివ కేశవుల అనుగ్రహంతో సిరి సంపదులకు లోటు ఉండదు!

కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమ నిష్ఠలతో శివుని ఆరాధిస్తారు. శివ కేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈ మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కార్తీక సోమవారం నాడు పాలతో ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది.

Published on: Oct 27, 2025 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రత్యేకించి పూజిస్తారు. నెల రోజులు కూడా దీపారాధన, నదీ స్నానాలు ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉంటారు. ఈరోజు మొదటి కార్తీక సోమవారం. ఈరోజు శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక సోమవారం సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది.

కార్తీక సోమవారం ఐశ్వర్య దీపం (pinterest)
కార్తీక సోమవారం ఐశ్వర్య దీపం (pinterest)

కార్తీక మాసం

కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమ నిష్ఠలతో శివుని ఆరాధిస్తారు. శివ కేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈ మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు వంటివి పాటిస్తూ ఉంటారు. వనభోజనాలను కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు.

బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. ఇక ఈరోజు కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం. ఈ సోమవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వలన పరమశివుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

కార్తీక సోమవారం నాడు పాలతో ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే మంచిది

ఈరోజు రాత్రి క్షీర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. కార్తీక సోమవారం ప్రదోషకాలంలో ఈ క్షీర దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 మధ్యలో ఈ క్షీర దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీనినే ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తారు. ఇక ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా తెలుసుకుందాం.

ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి?

  1. ముందు ఒక ఇత్తడి పళ్ళెం తీసుకుని దానిపై ఒక తమలపాకు పెట్టండి.
  2. దానిపై ఒక గాజు కప్పులో లేదా వెండి కప్పు పెట్టండి.
  3. ఇప్పుడు ఆ పాత్రలో పాలు పోసి పాత్రకు పసుపు, కుంకుమలు పెట్టాలి.
  4. ఆ పాత్ర చుట్టూ పువ్వులు పేర్చి అందంగా అలంకరించుకోవచ్చు.
  5. ఆ పాలపై నూనె కూడా పోయాలి.
  6. ఆ తర్వాత ఈ పాత్రపై ఒక తమలపాకు పెట్టండి. ఆ తమలపాకుకు పసుపు, కుంకుమలు రాయండి.
  7. ఈ ఆకుపై వత్తులు వేసి వెలిగించండి. (ఆ నూనె పైకి తేలి వత్తులు వెలుగుతాయి)
  8. ఇలా దీపారాధన చేయండి. ఆ తర్వాత “ఓం నమశ్శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి.