వాస్తు ప్రకారం ఉత్తరం వైపు వీటిని పెడితే ఎంతో మంచి జరుగుతుంది.. డబ్బు, ఆనందం, శాంతితో పాటు ఎన్నో!

ఇంట్లో ఏ దిశలో వేటిని పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఇంటి ఉత్తరం వైపు కొన్నిటిని పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఉత్తరం దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరం వైపు వీటిని పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

Published on: Nov 3, 2025, 08:00:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అయితే చాలామంది ఇంట్లో ఏ దిశలో వేటిని పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు.

వాస్తు ప్రకారం ఉత్తరం వైపు వీటిని పెడితే ఎంతో మంచిది జరుగుతుంది (pinterest)
వాస్తు ప్రకారం ఉత్తరం వైపు వీటిని పెడితే ఎంతో మంచిది జరుగుతుంది (pinterest)

ఇంటి ఉత్తరం వైపు కొన్నిటిని పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం ఉత్తరం దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరం వైపు వీటిని పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి నుంచి కూడా బయటపడవచ్చు.

వాస్తు ప్రకారం ఉత్తరం వైపు వీటిని పెడితే ఎంతో మంచి జరుగుతుంది

ఉత్తర దిశ కుబేరుని దిశ. ఈ దిశలో కొన్ని వస్తువులను ఉంచితే సంపద పెరుగుతుంది, సానుకూల ఆలోచనలు కలుగుతాయి. సానుకూల శక్తి ప్రవహించి ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.

1.నీటి కుండ:

ఉత్తరం వైపు ఒక నీటి కుండను పెట్టండి. లేదంటే వాటర్ ఫౌంటెన్ వంటివి పెట్టొచ్చు. వీటిని ఉంచడం వలన మంచి ఆలోచనలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి, పనిలో ఉన్న సమస్యలన్నీ తొలగి పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

2.నది లేదా జలపాతం ఫోటోలు:

ఉత్తర దిశలో నది లేదా జలపాతం ఫోటోలు పెడితే కూడా సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వీటిని ఉంచడం వలన ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.

3.డబ్బు:

ఇంట్లో విలువైన వస్తువులను ఉత్తరం వైపు పెడితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ దిశలో డబ్బు, విలువైన వస్తువులు, బంగారం వంటివి పెట్టడం వలన దురదృష్టం కూడా తొలగిపోతుంది. సానుకూల శక్తి ప్రవేశించి ఇంట్లో పరిస్థితులు అన్నీ చక్కగా పడతాయి.

4.కుబేరుని విగ్రహం:

ఉత్తర దిశలో కుబేరుని విగ్రహం లేదా ఫోటోను పెడితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సంపద పెరుగుతుంది, ఆనందం ఎక్కువ అవుతుంది. కుబేరుని ఆశీస్సులు కూడా లభిస్తాయి.

5.ఆక్వేరియం:

ఉత్తర దిశలో ఆక్వేరియం లేదా చేపల తొట్టె వంటివి పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపించి చెడు శక్తులు తొలగిపోతాయి. డబ్బు కలుగుతుంది, అడ్డంకులన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు, విజయాన్ని కూడా అందుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More