Akshay Tritiya Shopping Time : అక్షయ తృతీయకు షాపింగ్ చేయడానికి శుభ సమయం ఏది?
Akshaya Tritiya Shopping Time : అక్షయ తృతీయ పండుగ రోజున షాపింగ్ చేయడానికి ప్రాముఖ్యత ఉంది. ఈరోజున షాపింగ్ చేస్తే దాని ప్రయోజనాలు శాశ్వతమైనవని నమ్ముతారు.
అక్షయ తృతీయ పండుగను ఆదివారం ఏప్రిల్ 19, 2026న జరుపుకొంటున్నారు. అయితే కొందరు ఏప్రిల్ 20వ తేదీన కూడా నిర్వహించుకుంటున్నారు. హిందూ మతంలో ఈ రోజున బంగారం, వెండి, వాహనాలను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున చేసిన పుణ్యకార్యాల ఫలాలు ఎప్పటికీ తరగవని నమ్ముతారు.

అక్షయ తృతీయ సత్యయుగం, త్రేతాయుగం ప్రారంభాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ రోజుకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసిన ఏ శుభకార్యమైనా ఎప్పటికీ తరగదని శాస్త్రాలు చెబుతున్నాయి, అందుకే దీనికి అక్షయ తిథి అని పేరు వచ్చింది.
అయితే ఈ రోజున పూజ, దానధర్మాల ప్రాముఖ్యతను శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. మీరు ఇప్పటికీ అక్షయ తృతీయ నాడు బంగారం లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే, కొనుగోళ్లకు శుభ సమయం ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజంతా శుభకార్యాలు చేయడానికి అనుమతిస్తుంది. అయితే శుభ ఘడియలు చూసుకుని ఫాలో అయితే మరింత ఫలితం ఉంటుంది.
లాభ యోగం ఉదయం 9:06 నుండి 10:43 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు బంగారం, వెండి, వజ్రాలు వంటివి కొనుగోలు చేయవచ్చు.
అమృత యోగం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:20 వరకు జరుగుతుంది. ఈ సమయంలో మీరు భూమి, బంగారం, ఇల్లు, బట్టలు, వజ్రాలు, టీవీ లేదా రిఫ్రిజిరేటర్ను కొనుగోలు చేయవచ్చు.
మధ్యాహ్నం 1:57 నుండి 3:57 వరకు కూడా శుభ సమయం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కోసం బంగారం, వెండి వస్తువులు, వజ్రాలు, ఇల్లు లేదా భూమి వంటి ఏదైనా కొనుగోలు చేయవచ్చు.
శుభ సమయం సాయంత్రం 6:49 నుండి రాత్రి 8:12 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు వాహనాలు, బంగారం, వజ్రాలు, పాత్రలను కొనుగోలు చేయవచ్చు.
అమృత యోగం రాత్రి 8:12 నుండి ఉదయం 9:35 వరకు ఉంటుంది. భూమి, బంగారం, ఇల్లు, బట్టలు, వజ్రాలు, విద్యుత్ ఉపకరణాలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేయవచ్చు.
రాహుకాలంలో వద్దు
అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున ఏ పని కోసమైనా పంచాంగాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. అయితే రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయవద్దు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


