విఘ్నేశుడి పూజా మహోత్సవాలకు వేళయింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 14, సోమవారం రోజున గణేశ చతుర్థి పర్వదినం వచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మండపాలు, ఇళ్లలో కొలువుదీరే గణపయ్యకు భక్తులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. అయితే ఈ పండుగ రోజు ఎంతటి భక్తి ఉందో, అంతే కఠినమైన కొన్ని నమ్మకాలు, ఆచారాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది చంద్రదర్శనం చేయకూడదనే నిబంధన. ఈ రోజే చంద్రుడిని చూస్తే అపనిందలు కలుగుతాయని నమ్ముతారు. అసలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చంద్రుడికి వినాయక శాపం ఎందుకు వచ్చింది?

పురాణాల ప్రకారం ఒకసారి గణేశుడు తన వాహనమైన మూషికంపై వెళ్తూ ఉండగా, అకస్మాత్తుగా కింద పడిపోయారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఇదంతా చూస్తున్న చంద్రుడు బిగ్గరగా నవ్వాడు. తన రూపం, పతనాన్ని చూసి చంద్రుడు పరిహసించడం గణేశుడికి తీవ్ర అవమానంగా అనిపించింది. కోపోద్రిక్తుడైన గణపతి.. చంద్రుడిని క్షయ రోగంతో నశించిపోవాలని శాపం పెట్టారు. దీంతో క్షణక్షణానికి చంద్రుడి తేజస్సు తగ్గిపోవడం మొదలైంది.
శివుని తపస్సుతో దక్కిన ఉపశమనం
గణేశుడి శాపంతో విలవిల్లాడిన చంద్రుడు చివరకు పరమశివుడిని ఆశ్రయించాడు. శివ లింగాన్ని ప్రతిష్టించి కఠినమైన తపస్సు ఆచరించాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివయ్య ఆయన ప్రాణాలను కాపాడాడు. ఆ తర్వాత చంద్రుడు నేరుగా వినాయకుడిని వేడుకుని తన తప్పునకు క్షమాపణ కోరాడు. భక్తుడి ప్రార్థనను మన్నించిన గణపతి శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేకపోయినా, అందులో మార్పులు చేశారు. చంద్రుడు ప్రతిరోజూ క్షీణిస్తూ, మళ్లీ పక్షం రోజుల పాటు క్రమంగా పెరుగుతాడని వరం ప్రసాదించారు.
చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది?
"సాధారణ రోజుల్లో ఎవరైనా నిన్ను దర్శించుకోవచ్చు. కానీ భాద్రపద శుక్ల చవితి నాడు మాత్రం ఎవరూ చంద్రుడిని చూడకూడదు," అని గణేశుడు చంద్రుడికి షరతు పెట్టారు. ఆ రోజు ఎవరైతే చంద్ర దర్శనం చేసుకుంటారో, వారు సమాజంలో తీవ్రమైన అపనిందలు, చెడ్డ పేరును ఎదుర్కొంటారని హెచ్చరించారు.
సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ చవితి చంద్రుడిని పొరపాటున చూసి, శమంతకమణి చోరీ చేశారనే అపనిందను మోయాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ చవితి పర్వదినాన కేవలం పూజలు చేయడమే కాకుండా, పెద్దలు చెప్పిన ఇలాంటి సాంప్రదాయ నియమాలను కూడా పాటిస్తే జీవితంలో ఎలాంటి అవాంఛనీయ వివాదాలకు దూరంగా ఉండవచ్చని పండితులు సూచిస్తున్నారు.
{{/usCountry}}సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ చవితి చంద్రుడిని పొరపాటున చూసి, శమంతకమణి చోరీ చేశారనే అపనిందను మోయాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ చవితి పర్వదినాన కేవలం పూజలు చేయడమే కాకుండా, పెద్దలు చెప్పిన ఇలాంటి సాంప్రదాయ నియమాలను కూడా పాటిస్తే జీవితంలో ఎలాంటి అవాంఛనీయ వివాదాలకు దూరంగా ఉండవచ్చని పండితులు సూచిస్తున్నారు.
{{/usCountry}}