వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? గణపతి శాపం వెనుక అసలు కథ ఇదే!

గణేశ చతుర్థి రోజున పాటించే ముఖ్యమైన ఆచారాల్లో చంద్రదర్శనం చేయకూడదనే నమ్మకం ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే అపనిందలు, చెడ్డ పేరు ఎదురవుతాయని పురాణ కథనాలు చెబుతున్నాయి.  

Published on: Sep 14, 2026, 09:00:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విఘ్నేశుడి పూజా మహోత్సవాలకు వేళయింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 14, సోమవారం రోజున గణేశ చతుర్థి పర్వదినం వచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మండపాలు, ఇళ్లలో కొలువుదీరే గణపయ్యకు భక్తులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. అయితే ఈ పండుగ రోజు ఎంతటి భక్తి ఉందో, అంతే కఠినమైన కొన్ని నమ్మకాలు, ఆచారాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది చంద్రదర్శనం చేయకూడదనే నిబంధన. ఈ రోజే చంద్రుడిని చూస్తే అపనిందలు కలుగుతాయని నమ్ముతారు. అసలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? గణపతి శాపం వెనుక అసలు కథ ఇదే! (AI)
వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? గణపతి శాపం వెనుక అసలు కథ ఇదే! (AI)

చంద్రుడికి వినాయక శాపం ఎందుకు వచ్చింది?

పురాణాల ప్రకారం ఒకసారి గణేశుడు తన వాహనమైన మూషికంపై వెళ్తూ ఉండగా, అకస్మాత్తుగా కింద పడిపోయారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఇదంతా చూస్తున్న చంద్రుడు బిగ్గరగా నవ్వాడు. తన రూపం, పతనాన్ని చూసి చంద్రుడు పరిహసించడం గణేశుడికి తీవ్ర అవమానంగా అనిపించింది. కోపోద్రిక్తుడైన గణపతి.. చంద్రుడిని క్షయ రోగంతో నశించిపోవాలని శాపం పెట్టారు. దీంతో క్షణక్షణానికి చంద్రుడి తేజస్సు తగ్గిపోవడం మొదలైంది.

శివుని తపస్సుతో దక్కిన ఉపశమనం

గణేశుడి శాపంతో విలవిల్లాడిన చంద్రుడు చివరకు పరమశివుడిని ఆశ్రయించాడు. శివ లింగాన్ని ప్రతిష్టించి కఠినమైన తపస్సు ఆచరించాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివయ్య ఆయన ప్రాణాలను కాపాడాడు. ఆ తర్వాత చంద్రుడు నేరుగా వినాయకుడిని వేడుకుని తన తప్పునకు క్షమాపణ కోరాడు. భక్తుడి ప్రార్థనను మన్నించిన గణపతి శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేకపోయినా, అందులో మార్పులు చేశారు. చంద్రుడు ప్రతిరోజూ క్షీణిస్తూ, మళ్లీ పక్షం రోజుల పాటు క్రమంగా పెరుగుతాడని వరం ప్రసాదించారు.

చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది?

"సాధారణ రోజుల్లో ఎవరైనా నిన్ను దర్శించుకోవచ్చు. కానీ భాద్రపద శుక్ల చవితి నాడు మాత్రం ఎవరూ చంద్రుడిని చూడకూడదు," అని గణేశుడు చంద్రుడికి షరతు పెట్టారు. ఆ రోజు ఎవరైతే చంద్ర దర్శనం చేసుకుంటారో, వారు సమాజంలో తీవ్రమైన అపనిందలు, చెడ్డ పేరును ఎదుర్కొంటారని హెచ్చరించారు.

సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ చవితి చంద్రుడిని పొరపాటున చూసి, శమంతకమణి చోరీ చేశారనే అపనిందను మోయాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ చవితి పర్వదినాన కేవలం పూజలు చేయడమే కాకుండా, పెద్దలు చెప్పిన ఇలాంటి సాంప్రదాయ నియమాలను కూడా పాటిస్తే జీవితంలో ఎలాంటి అవాంఛనీయ వివాదాలకు దూరంగా ఉండవచ్చని పండితులు సూచిస్తున్నారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More