యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఒక వినూత్నమైన మోసం వెలుగుచూసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సిబ్బందిగా నటిస్తూ వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు ఒక మహిళకు చెందిన బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించి పరారయ్యారు.

నివేదికల ప్రకారం బీబీనగర్ మండలానికి చెందిన కె.అండాలు అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చారు. తాము 'SIR' సర్వే కోసం వచ్చామని, ఆమె ఫోటోలు తీసుకోవాలని నమ్మించారు. అయితే ఫోటో తీసేటప్పుడు మెడలోని మంగళసూత్రం కనిపించకూడదని, కాబట్టి దాన్ని తీసేయాలని ఆమెకు చెప్పారు.
నిజమేనని నమ్మిన అండాలు తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి, ఇంటి బయటే నిలబడి ఉన్న తన భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత సదరు నిందితులు ఆమెను కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని గుడికి రావాలని ఆమెను కోరారు.
బాధితురాలు వారితో కలిసి ఒక 200 మీటర్లు నడిచిన తర్వాత, ఆ ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వెనక్కి తిరిగారు. వేగంగా తిరిగి ఇంటి వద్దకు చేరుకుని, అక్కడ నిలబడి ఉన్న ఆమె భర్త చేతిలో ఉన్న బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని బైక్పై పారిపోయారు. ఈ ఘటనపై బాధితులు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పథకాలు, సర్వేలు లేదా వివిధ రకాల తనిఖీల పేరుతో ఇలాంటి కొత్త రకం మోసాలు ఎక్కువవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లకు వచ్చి సర్వేల పేరుతో నగలు తీసేయమనడం లేదా వివరాలు అడగడం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అధికారిక గుర్తింపు కార్డులు లేకుండా వచ్చే వారిని నమ్మవద్దని, అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డిలో బంగ్లాదేశీ వివాదం!
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు వ్యక్తులు తనను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని, దాడి చేశారని ఒక మహిళా బీఎల్ఓ ఆరోపించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 42 ఏళ్ల మహిళ తాను ఇంటింటికీ వెళ్లి ఓటర్ల గణన చేస్తుండగా జూలై 10న ఈ సంఘటన జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలు తన వద్దకు వచ్చి ఒక గణన పత్రాన్ని సమర్పించారని ఆమె ఆరోపించింది.
{{/usCountry}}తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు వ్యక్తులు తనను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని, దాడి చేశారని ఒక మహిళా బీఎల్ఓ ఆరోపించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 42 ఏళ్ల మహిళ తాను ఇంటింటికీ వెళ్లి ఓటర్ల గణన చేస్తుండగా జూలై 10న ఈ సంఘటన జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలు తన వద్దకు వచ్చి ఒక గణన పత్రాన్ని సమర్పించారని ఆమె ఆరోపించింది.
{{/usCountry}}పరిశీలన సమయంలో ఫిర్యాదుదారుడు ఆ ఫారమ్కు ఫోటో అతికించి లేకపోవడాన్ని గమనించింది బీఎల్ఓ. అక్కడున్న మహిళల్లో ఒకరిని ఫోటో కావాలని అడగ్గా.. తాను బంగ్లాదేశ్కు చెందినదానినని అందువల్ల తన ఫోటోను అతికించనని సమాధానమిచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ దానిని స్వీకరించడానికి నిరాకరించారు. ఆ ఇద్దరు మహిళలు తనను అధికార విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, దూషించారని, నెట్టారని బీఎల్ఓ ఆరోపించారు. మరో వ్యక్తి అక్కడికి వచ్చి, బంగ్లాదేశ్ గురించి ప్రస్తావిస్తూ ఫారం తిరస్కరించినందుకు తనను ప్రశ్నించాడని, దానిని అంగీకరించకపోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపారు.
వాగ్వాదం సమయంలో నిందితులు తన మొబైల్ ఫోన్ను లాక్కొని పాడుచేశారని ఫిర్యాదులో ఆరోపించారు. తనను దూషించి, దాడి కూడా చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదులో ఆరోపించినట్లుగా గణన పత్రాన్ని సమర్పించిన మహిళ బంగ్లాదేశీనా అని అడగ్గా, ఆ మహిళ భారతీయురాలని పోలీసు అధికారి తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం ఇంటింటి గణన జూన్ 25న ప్రారంభమైంది, ఈ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగుతుంది.