...
...
Next Story

ప్రజలకు అలర్ట్.. SIR సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేసిన కేటుగాళ్లు!

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) సర్వే ప్రక్రియ నడుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళకు చెందిన మంగళసూత్రం కొట్టేశారు.

Published on: Jul 13, 2026, 05:39:36 IST
Advertisement

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఒక వినూత్నమైన మోసం వెలుగుచూసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సిబ్బందిగా నటిస్తూ వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు ఒక మహిళకు చెందిన బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించి పరారయ్యారు.

సర్ సర్వే పేరుతో మోసం
సర్ సర్వే పేరుతో మోసం

నివేదికల ప్రకారం బీబీనగర్ మండలానికి చెందిన కె.అండాలు అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చారు. తాము 'SIR' సర్వే కోసం వచ్చామని, ఆమె ఫోటోలు తీసుకోవాలని నమ్మించారు. అయితే ఫోటో తీసేటప్పుడు మెడలోని మంగళసూత్రం కనిపించకూడదని, కాబట్టి దాన్ని తీసేయాలని ఆమెకు చెప్పారు.

నిజమేనని నమ్మిన అండాలు తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి, ఇంటి బయటే నిలబడి ఉన్న తన భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత సదరు నిందితులు ఆమెను కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా తదుపరి ప్రక్రియ కోసం సమీపంలోని గుడికి రావాలని ఆమెను కోరారు.

బాధితురాలు వారితో కలిసి ఒక 200 మీటర్లు నడిచిన తర్వాత, ఆ ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వెనక్కి తిరిగారు. వేగంగా తిరిగి ఇంటి వద్దకు చేరుకుని, అక్కడ నిలబడి ఉన్న ఆమె భర్త చేతిలో ఉన్న బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనపై బాధితులు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పథకాలు, సర్వేలు లేదా వివిధ రకాల తనిఖీల పేరుతో ఇలాంటి కొత్త రకం మోసాలు ఎక్కువవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లకు వచ్చి సర్వేల పేరుతో నగలు తీసేయమనడం లేదా వివరాలు అడగడం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అధికారిక గుర్తింపు కార్డులు లేకుండా వచ్చే వారిని నమ్మవద్దని, అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.

కామారెడ్డిలో బంగ్లాదేశీ వివాదం!

పరిశీలన సమయంలో ఫిర్యాదుదారుడు ఆ ఫారమ్‌కు ఫోటో అతికించి లేకపోవడాన్ని గమనించింది బీఎల్ఓ. అక్కడున్న మహిళల్లో ఒకరిని ఫోటో కావాలని అడగ్గా.. తాను బంగ్లాదేశ్‌కు చెందినదానినని అందువల్ల తన ఫోటోను అతికించనని సమాధానమిచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ దానిని స్వీకరించడానికి నిరాకరించారు. ఆ ఇద్దరు మహిళలు తనను అధికార విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, దూషించారని, నెట్టారని బీఎల్ఓ ఆరోపించారు. మరో వ్యక్తి అక్కడికి వచ్చి, బంగ్లాదేశ్ గురించి ప్రస్తావిస్తూ ఫారం తిరస్కరించినందుకు తనను ప్రశ్నించాడని, దానిని అంగీకరించకపోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపారు.

వాగ్వాదం సమయంలో నిందితులు తన మొబైల్ ఫోన్‌ను లాక్కొని పాడుచేశారని ఫిర్యాదులో ఆరోపించారు. తనను దూషించి, దాడి కూడా చేశారని పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదులో ఆరోపించినట్లుగా గణన పత్రాన్ని సమర్పించిన మహిళ బంగ్లాదేశీనా అని అడగ్గా, ఆ మహిళ భారతీయురాలని పోలీసు అధికారి తెలిపారు. తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం ఇంటింటి గణన జూన్ 25న ప్రారంభమైంది, ఈ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగుతుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe