ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాకు చెందిన 'అమెజాన్ బజార్' తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్లాట్ఫామ్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదరణ భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్డర్ల సంఖ్య ఏకంగా 4 రెట్లు పెరిగిందని అమెజాన్ బజార్ ఇండియా హెడ్ సమీర్ లల్వానీ వెల్లడించారు.
పెరిగిన ఆర్డర్లు….

ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్లో అమెజాన్ బజార్ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపుతోంది. మంగళవారం విలేకరుల సమావేశంలో లల్వానీ మాట్లాడుతూ.. హైదరాబాద్లో కొత్తగా సైన్-అప్ అవుతున్న కస్టమర్ల సంఖ్యలో 4 రెట్లు వృద్ధి నమోదైందని తెలిపారు. కేవలం 2026 సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే హైదరాబాద్ మార్కెట్లో ఆరు రెట్లు వృద్ధిని సాధించామని ప్రకటించారు. 2024లో ప్రారంభమైన ఈ విభాగం… అతి తక్కువ కాలంలోనే సామాన్యులకు చేరువకావడం గమనార్హం.
ఏయే విభాగాల్లో వృద్ధి ఎలా ఉందనే అంశాలపై సమీర్ లల్వానీ స్పష్టతనిచ్చారు. మహిళల ఫ్యాషన్ విభాగంలో ఆర్డర్లు 6 రెట్లు పెరిగాయి. హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులకు అత్యధికంగా 8 రెట్లు డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ విభాగంలో 4 రెట్ల వృద్ధి నమోదైంది.
కేవలం అమ్మకాలే కాకుండా…. స్థానిక వ్యాపారులకు కూడా అమెజాన్ బజార్ పెద్ద పీట వేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమెజాన్ ప్లాట్ఫామ్పై మొత్తం 75,000 మందికి పైగా విక్రేతలు ఉండగా, అందులో 1,200 మంది ప్రత్యేకంగా అమెజాన్ బజార్లో భాగస్వాములుగా ఉన్నారు.
గతేడాదితో పోలిస్తే విక్రేతల సంఖ్య 2.4 రెట్లు పెరగ్గా, ఉత్పత్తుల ఎంపిక (Product Selection) కూడా 2.5 రెట్లు విస్తరించింది. దీనివల్ల స్థానిక చిన్న తరహా వ్యాపారాలు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరువయ్యే అవకాశం లభిస్తోంది.
{{/usCountry}}గతేడాదితో పోలిస్తే విక్రేతల సంఖ్య 2.4 రెట్లు పెరగ్గా, ఉత్పత్తుల ఎంపిక (Product Selection) కూడా 2.5 రెట్లు విస్తరించింది. దీనివల్ల స్థానిక చిన్న తరహా వ్యాపారాలు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరువయ్యే అవకాశం లభిస్తోంది.
{{/usCountry}}"ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అమెజాన్ బజార్కు కీలకమైన వృద్ధి కేంద్రాలు. ఆన్లైన్ షాపింగ్ విషయంలో వినియోగదారుల ప్రవర్తనలో నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల నుంచి వస్తున్న స్పందన ఆశాజనకంగా ఉంది," అని సమీర్ లల్వానీ వివరించారు.
పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా అమెజాన్ తన కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 8 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 3 సార్టేషన్ సెంటర్లు, సుమారు 1,500 మంది హబ్ డెలివరీ పార్ట్నర్లతో బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. దీనివల్ల మారుమూల పట్టణాలు, గ్రామాలకు కూడా వేగంగా డెలివరీ చేసే సదుపాయం కలుగుతోంది. అమెజాన్ బజార్ 2024లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.