Bandi Bhageerath : బండి భగీరథ్​కు ముందస్తు బెయిల్? హైకోర్టు మాటలు ఇలా..

Bandi Bhageerath case update : బండి భగీరథ్​కు ముందస్తు బెయిల్​ ఇచ్చే విధంగా ఇప్పట్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్​ నుంచి రక్షణ కూడా కల్పించలేమని తేల్చేసింది.

Published on: May 16, 2026, 08:15:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bandi Bhageerath bail : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాత్రి వరకు విచారణ జరిపింది. అనంతరం బండి సంజయ్ కుమారుడి ముందస్తు బెయిల్​పై ఇప్పట్లో ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ పూర్తి వ్యవహారంపై మే 21, గురువారం నాడు తీర్పును వెలువరిస్తామని ప్రస్తుతానికి రిజర్వులో పెట్టింది.

బండి సాయి భగీరథ్
బండి సాయి భగీరథ్

కాగా.. మైనర్​పై లైంగిక వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న భగీరథ్​కి అరెస్ట్ (కనీసం ముందస్తు బెయిల్​ తీర్పు వెలువడే వరకైనా)​ నుంచి రక్షణ కల్పించాలని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ మేరకు పోలీసులకు అన్ని విధాలుగా సహకరించేందుకు తమ క్లైంట్ సిద్ధమని వివరించారు. ఈ విజ్ఞప్తిని సైతం హైకోర్టు తోసిపుచ్చింది.

అర్థరాత్రి వరకు విచారణ- బెయిల్​కి నో!

బండి భగీరథ్ ముందస్తు బెయిల్​ పిటిషన్​పై జస్టిస్​ మాధవీదేవి శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు అర్థరాత్రి 12 గంటల వరకు విచారణ జరిపారు. తన క్లైంట్​ని ఇరికించేందుకే పోలీసులు అతనిపై పోక్సోలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు వేశారని నిందితుడి తరఫు న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్​ నిరంజన్​ రెడ్డి వాదించారు. డిసెంబర్​లో ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారని, కానీ మార్చ్​ నెలలో న్యాయనిపుణుల సూచనలతో పక్కా ప్రణాళికతో మే నెలలో కేసు వేశారని అన్నారు. పైగా రాష్ట్రంలో తమ పిటిషనర్​ తండ్రికి సంబంధించిన ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉందని ఆయన గుర్తుచేశారు.

“మా క్లైంట్​, ఫిర్యాదు దాఖలు చేసిన మైనర్​ రిలేషన్​లో ఉన్నట్టు అందరికి తెలుసు. మైనర్​ తల్లిదండ్రులకు కూడా తెలుసు. వారిద్దరు కలిసే తిరిగేవారు. గతేడాది జరిగింది అంటున్నారు. కానీ ఇంత ఆలస్యంగా కేసు పెట్టారు. వాస్తవానికి మొదట చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు పెట్టారు. కానీ బెయిల్​ వచ్చేస్తుందేమో అనే పెద్ద పెద్ద సెక్షన్లతో ఇరికించారు. అందుకే నా క్లైంట్ ముందస్తు బెయిల్​కి అర్హుడు,” అని ఎస్​ నిరంజన్​ రెడ్డి తన వాదనలో వివరించారు.

Bandi Sanjay: బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండె పోటు..

దీనికి బదులుగా మైనర్​ తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వర్​రావు జడ్జి ముందు తన వాదనలు వినిపించారు.

“నా క్లైంట్​తో పాటు బండి భగీరథ్​ మరో నలుగురు అమ్మాయిలను వేధించాడు. వాళ్లందరు త్వరలోనే బయటకు వస్తారు. కానీ కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఎంపీ తన అధికార బలన్ని వాడుకుంటున్నారు. ఇంతటి తీవ్రమైన కేసులో ముందస్తు బెయిల్, అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించడం సరైనది కాదు,” అని పేర్కొన్నారు.

తమ పిటిషనర్​ తండ్రి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేరని, అలాంటప్పుడు కేసును ఎలా ప్రభావితం చేయగలరని, అవన్ని తప్పుడు ఆరోపణలను బండి భగీరథ్ న్యాయవాది కోర్టు ఎదుట వ్యాఖ్యానించారు.

బండి భగీరథ్ తరఫు న్యాయవాది వాదనలు, మైనర్​ వాగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం కేసు తీవ్రత నేపథ్యంలో బండి భగీరథ్ ముందస్తు బెయిల్​ విటిషన్​పై ఈ దశలో తీర్పును వెలువరించలేమని తెలంగాణ హైకోర్టు జస్టిస్ మాధవీదేవి తేల్చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More