...
...
Next Story

తెలంగాణలో భీమ్ యాప్ హవా.. ఎక్కువ పేమెంట్స్ దేనికి చేస్తున్నారో తెలుసా?

భీమ్(BHIM) పేమెంట్స్ యాప్ లావాదేవీల్లో దూసుకెళ్తోంది. తెలంగాణలో ఎక్కువ శాతం జనాలు ఈ భీమ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

Updated on: Jun 24, 2026, 21:36:30 IST
Advertisement

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన భీమ్(BHIM) పేమెంట్స్ యాప్ లావాదేవీలు గత ఏడాది కాలంలో ఊహించని రీతిలో పెరిగాయి. జూన్ 2025 నుంచి మే 2026 మధ్య కాలంలో భీమ్ యాప్ ద్వారా జరిగిన నెలవారీ లావాదేవీల సంఖ్య ఏకంగా మూడు రెట్లకు పైగా పెరిగినట్లు ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ వెల్లడించింది.

రికార్డు స్థాయిలో లావాదేవీలు

భీమ్ యాప్
భీమ్ యాప్

జూన్ 2025లో భీమ్ యాప్ ద్వారా 7.96 కోట్ల (79.64 మిలియన్) లావాదేవీలు జరగ్గా.. మే 2026 నాటికి ఈ సంఖ్య ఏకంగా 24.4 కోట్లకు (244 మిలియన్) చేరింది. కేవలం మే 2026 ఒక్క నెలలోనే ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రూ.26,952 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరగడం విశేషం.

తెలంగాణలో భీమ్ హవా!

తెలంగాణ రాష్ట్రంలో కూడా భీమ్ యాప్ వినియోగం మూడు రెట్లు పెరిగింది. తెలంగాణ ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం డిజిటల్ చెల్లింపుల వైపు ఎంతలా మొగ్గు చూపుతున్నారో కింద పేర్కొన్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మే 2026లో తెలంగాణలో జరిగిన మొత్తం మర్చంట్ (వ్యాపార) లావాదేవీలలో.. కిరాణా సామాగ్రి 23.9 శాతం, హోటళ్లు/ఫుడ్ అవుట్‌లెట్లు 18.1 శాతం, క్విక్ కామర్స్ (ఇన్‌స్టంట్ డెలివరీ యాప్స్) 11.6 శాతం చెల్లింపులు భీమ్ యాప్ ద్వారానే జరిగాయి.

నగదు రహిత చెల్లింపులు

తెలంగాణలో భీమ్ యాప్ సాధించిన ఈ అద్భుత వృద్ధిపై ఎన్‌బీఎస్‌ఎల్ (NBSL) ఎండీ, సీఈఓ లలితా నటరాజ్ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రజల రోజువారీ జీవితంలో డిజిటల్ చెల్లింపులు అంతర్భాగంగా మారాయనడానికి ఈ వృద్ధి నిదర్శనం. నిత్యావసరాలు, హోటళ్లు, క్విక్ కామర్స్ వంటి నిత్య జీవిత ఖర్చుల కోసం ప్రజలు నగదు రహిత చెల్లింపులను ఆశ్రయించడం శుభపరిణామం. వినియోగదారులకు మరింత సులువైన, సురక్షితమైన డిజిటల్ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం.' అని లలితా నటరాజ్ పేర్కొన్నారు.

ప్రాంతీయ భాషల్లో

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe